నమస్తేతెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 25 : క్రిస్మస్ వేడుకలను వరంగల్, హనుమకొండ జిల్లాల వ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులు చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కరుణాపురం క్రీస్తుజ్యోతి ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలకు స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి-వినయరాణి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి జీవించాలన్నారు. కార్యక్రమాల్లో క్రీస్తుజ్యోతి ప్రార్థనా మందిరం నిర్వాహకుడు సంగాల పాల్సన్రాజ్, పంతులు కమలాకర్, సంఘ పెద్దలు ప్రవీణ్, విల్సన్, చిరంజీవి, సుధాకర్, రాజన్బాబు పాల్గొన్నారు. అలాగే, కాజీపేట రహ్మత్నగర్లోని తెలుగు బాప్టిస్టు చర్చిలో మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ పాలనలో నగరాన్ని అధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. పాస్టర్ అయ్యాల దానం, బీఆర్ఎస్ నాయకులు సురేశ్కుమార్, మిట్టపల్లి రవీందర్, కాంట్రాక్టర్ బోళ్ల కుమార్ పాల్గొన్నారు. కాగా, కాజీపేటలోని రైల్వే శ్రీధర్మ శాస్ర్త ఆలయాన్ని కూడా చీఫ్విప్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి(సీబీసీ)లో పాస్టర్ నిరంజన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎంపీ దయాకర్ దంపతులు, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ అజీజ్ఖాన్ పాల్గొని ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. యువత చర్చి వద్ద సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. అనంతరం ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఫాతిమానగర్ చర్చిలో వరంగల్ పీఠాధిపతి బిషప్ ఉడముల బాల, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, చర్చి ప్రెసిడెంట్ దయాసాగర్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు.
న్యూశాయంపేట జంక్షన్లోని హెర్మోన్ చర్చి సంఘ పాస్టర్ రాము వడ్నాల ఆధ్వర్యంలో, హంటర్రోడ్డులోని కల్వరి టెంపుల్ వ్యవస్థాపకుడు సతీశ్కుమార్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. రంగంపేటలోని ఎవాన్జిలికల్ బాప్టిస్ట్ చర్చిలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పాల్గొన్నారు. పరకాల పట్టణంలోని సీఎస్ఐ చర్చి, వెల్లంపల్లి, నడికూడ మండలంలోని రాయపర్తి, నర్సక్కపల్లి, పులిగిల్ల తదితర గ్రామాల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో రేవూరి పాల్గొన్నారు. పాస్టర్లతో కలిసి కేక్ కట్ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మడికొండ శ్రీను, మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్రెడ్డి పాల్గొన్నారు. నగరంలోని 18వ డివిజన్ లేబర్కాలనీలోని సీబీసీ చర్చి, సెంటినరీ ట్రినిటీ బాప్టిస్ట్ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. కేక్ కిట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నల్లబెల్లిలోని సీఎస్ఐ చర్చితోపాటు చెన్నారావుపేట మండలం పాత ముగ్ధుంపురం, తిమ్మరాయిన్పహాడ్లోని పునీతరాయప్ప చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పర్వతగిరి మండలం ఏనుగల్లులోని బాప్టిస్ట్ చర్చి, వర్ధన్నపేట పట్టణంలోని చాల్సీడేనా ప్రార్థనా మందిరంతో ఐనవోలు మండలం కక్కిరాలపల్లిలోని చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల తర్వాత కేక్ కట్ చేశారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.