వరంగల్ : మీకు ఎప్పటికి ఉపాధి కల్పించే రంగాన్ని ఎన్నుకోండి. అందులో మీకు అవగాహన ఉంటేనే పెట్టుబడి పెట్టాలని కలెక్టర్ గోపి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దళితబంధు పథకం తొలివిడత లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గోపి లబ్ధిదారులకు పలు సలహాలు, సూచనలు చేశారు.
జిల్లాకి సంబందించిన లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందన్నారు. రూ. పది లక్షల పెట్టుబడితో రెగ్యులర్ గా లాభాలు వచ్చే పనిని ఎంచుకోవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ. పది లక్షలను రెట్టింపు చేయాలని సూచించారు. నష్టం రాకుండా జాగ్రత్త గా ముందడుగు వేయాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే సొమ్మును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.