హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 13 : ‘బుద్ధభవన్ నాకు జీవిత పాఠాలు నేర్పిం ది.. ధైర్యాన్ని.. స్ఫూర్తినిచ్చింది.. రాజకీ య పునాది వేసింది.. నాతో పాటు వేలా ది మందికి విలువలతో కూడిన విద్యను, పోరాట పటిమను అందించిన బీఆర్ భగవాన్దాస్ను నా గొంతులో ప్రాణమున్నంత వరకూ మరిచిపోలేను’ అని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ భావోద్వేగానికి లోనయ్యారు. హనుమకొండలో గురువారం నిర్వహించిన కుమార్పల్లి బుద్ధభవన్ ఆత్మీయ సమ్మేళనంలో అంబేద్కర్, బీఆర్ భగవాన్దాస్ చిత్రపటాలకు చీఫ్విప్, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దాస్యం మాట్లాడు తూ బుద్ధభవన్తో పాటు బీఆర్ భగవాన్దాస్ కుటుంబంతో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. ఆ రోజుల్లో ఈ వా డకు వస్తే ధైర్యం, స్ఫూర్తి నిండేదన్నారు.
అంకితభావం, పట్టుదల, ప్రేమానురాగాలతో బుద్ధభవన్ను నిర్మించుకున్నామని, అదే స్ఫూర్తితో పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రూ.50 లక్షలతో బుద్ధభవన్ను పునర్నిర్మిస్తామని చెప్పారు. గొప్ప స్ఫూర్తినిచ్చిన ఈ భవనం నేలమట్టమవుతుందని ఓ వైపు బాధ ఉన్నా మరోవైపు బీఆర్ భగవాన్దాస్ ఆశయాలకు అనుగుణంగా, అందరి ఆకాంక్ష మేరకు బ్రహ్మాండంగా భవనాన్ని కట్టుకోబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. బుద్ధభవన్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అంబేదర్ సూచన మేరకు ఇందులో అర్హులైన అందరికీ దళితబంధు అందిస్తామన్నారు. అసెంబ్లీలో కార్మికుల హకుల కోసం పోరాడిన సం దర్భంలో ఒక కార్యకర్తగా భగవాన్దాస్ తో ఉండడం మరువలేని రోజులని గుర్తుచేసుకున్నారు. అసంఘటిత రంగ కార్మికుల కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రతి జిల్లాలో స్థలాన్ని కేటాయించి కోటి రూపాయలతో కార్మిక భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
కన్నీరు పెట్టుకున్న దాస్యం
బుద్ధభవన్ స్మృతులను గుర్తుచేసుకొని చీఫ్విప్ దాస్యం భావోద్వేగానికిలోనై కన్నీరు పెట్టుకున్నారు. రెండురోజుల క్రితం బుద్ధభవన్ గురించి ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురించిన కథనాన్ని చదివి గుండె బరువెక్కిందన్నారు. తన గొంతు లో ప్రాణమున్నంత వరకు భగవాన్దాస్ను, బుద్ధభవన్ను మరిచిపోలేనని చెప్పారు. ఆ రోజు అంకిత భావంతో బు ద్ధభవన్ను నిర్మించారు కాబట్టే ఆ గోడలు ఇంత దృఢంగా ఉన్నాయన్నారు. అంతకుముందు ప్రొజెక్టర్ ద్వారా బుద్ధభవన్ ను ప్రదర్శించారు. కార్యక్రమంలో బుద్ధభవన్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బీఆర్ అంబేదర్, కార్యదర్శి వంగాల సుదర్శన్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కూనమల్ల జితేందర్నాథ్, విశ్లేషకులు గొర్రె రవికుమార్, సాంసృతిక సారథి రాజలింగం, అంకేశ్వరపు సారయ్య, ఎస్ గణేశ్, బూజుగుండ్ల కిషన్, అంబేదర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు యాళ్ల సంజయ్, కార్యదర్శి సాదు వేణు, కోశాధికారి పీసరి లక్ష్మణ్ పాల్గొన్నారు.