హనుమకొండ, నవంబర్ 22 : పశ్చిమ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్య ర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. బాలసముద్రంలోని పార్టీ కార్యాలయానికి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేరుకొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యువ నాయకుడు రంజిత్రెడ్డి ఆధ్వర్యంలో 2 వేల మంది యువకులతో ఏకశిలా పార్కును పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో అమరవీరుల సాక్షిగా దాస్యం వినయ్ భాసర్కు ఓటు వేసి గెలిపిస్తామని ప్రమాణం చేశారు. పటాకులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాసర్ మాట్లాడుతూ అభిమానులకు నిత్యం అండగా ఉంటానన్నారు. కార్యకర్తలే తన బలం.. బలగం అని అన్నారు. గడపగడపకూ తిరిగి బీఆర్ఎస్ గెలుపు కోసం కృషిచేయాలని కోరారు. అనంతరం 200 మం ది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా వారిని చీఫ్విప్ ఆహ్వానించారు. కాగా, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్ వినూత్న రీతిలో దాస్యం చిత్రపటాన్ని ఇసుకతో గీయించి తన అభిమానం చాటుకున్నారు. కార్యక్రమంలో పరశురాములు, మెట్టు సంతోష్, పస్తం అనిల్, కల్యాణ్, విక్రమ్, సృజన, వాసు, వివేక్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
గిర్మాజీపేట : దాస్యం వినయ్భాస్కర్ పుట్టినరోజు సందర్భంగా 29వ డివిజన్లో మేయర్ సుధారాణి క్యాంపు కార్యాలయంలో డివిజన్ బీఆర్ఎస్ నాయకుల సమక్షంలో ఆమె కేక్ కట్ చేశారు. ఈ సం దర్భంగా మేయర్ మాట్లాడుతూ వినయ్భాస్కర్ గెలుపునకు ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కొడకండ్ల సదాంత్, సీనియర్ నాయకులు శ్రీరాముల సురేశ్, రాచర్ల రాము, గట్టు చందుగౌడ్, ఎండీ షఫీ, కొప్పుల సతీశ్, వాడికల నాగరాజు, తాళ్లపల్లి రమేశ్గౌడ్, నక్క జ్యోతి పాల్గొన్నారు. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటా ప్రచారం చేశారు.
హనుమకొండ చౌరస్తా : రెడ్డికాలనీలోని అతిథి మానసిక వికలాంగుల గృహంలో పిల్లలతో కలిసి దాస్యం రేవతీ, కొత్తూరు జేఏసీ కన్వీనర్ తాడిశెట్టి క్రాంతికుమార్ ఆధ్వర్యంలో వినయ్ భాసర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పిల్లలకు బిసెట్లు పండ్లు, దుప్పట్ల పంపిణీ చేశారు. అనంతరం తాడిశెట్టి క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో కొత్తూరు జెండా దగ్గర, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద వేడుకలు నిర్వహించారు. కాగా, 8వ డివిజన్లో దాస్యం రేవతి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
కాజీపేట : బాపూజీనగర్లో 47వ డివిజన్ కన్వీనర్, పార్టీ ప్రధాన కార్యదర్శి గబ్బెట శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థలు చేశారు. 61వ ప్రశాంత్ నగర్లో డివిజన్ అధ్యక్షుడు కోటి లింగం ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. పార్టీ సీనియర్ నాయకుడు నార్లగిరి రమేశ్, కార్పొరేటర్ ఎలకంటి రాములు పాల్గొన్నారు. అలాగే, కాజీపేటకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు మర్యాల కృష్ణ ఆధ్వర్యంలో పలువురు నాయకులు చీఫ్విప్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
న్యూశాయంపేట : గ్రేటర్ 31వ డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్ మాడిశెట్టి శివశంకర్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు చీఫ్ విప్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, మున్నూరుకాపు నాయకులు కటకం పెంటయ్య, పెరికారి శ్రీధర్ కూడా కలిసి మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.