ఖానాపురం/దుగ్గొండి, నవంబర్ 28: రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేస్తున్నదని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్ అన్నారు. ఖానాపురం మండలంలోని అయోధ్యనగర్లో గోదాదేవి రైతుత్పత్తి సంఘం, అశోక్నగర్లో పాకాల రైతుమిత్ర సంఘం, రాగంపేట, రంగాపురం, ధర్మారావుపేట, దబీర్పేట గ్రామాల్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణలో వ్యవసాయాన్ని పం డుగ చేసేందుకే సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని గుర్తుచేశారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, సర్పంచ్లు గొర్రె కవిత, అశోక్, శ్రుతి, నీలమ్మ, ఐలయ్య, రమ, గంగాధర రమేశ్, నాగేశ్వర్రావు, వెంకన్న పాల్గొన్నారు.
కేంద్రాలను వినియోగించుకోవాలి
దుగ్గొండి/గీసుగొండ/నల్లబెల్లి/సంగెం: గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వియోగించుకోవాలని దు గ్గొండి ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య కోరారు. సోమవారం దుగ్గొండి మండలంలోని నాచినపల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ ప్రారంభించారు. ఏ-గ్రేడ్ ధాన్యానికి రూ. 2060, సీ-గ్రేడ్ ధాన్యానికి ప్రభుత్వం రూ. 2040 మద్దతు ధర చెల్లిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంపత్కుమార్, ఏవో దయాకర్, నాచినపల్లి పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్వర్రావు, ఏఈవో మౌనిక, నాచినపల్లి సర్పంచ్ పెండ్యాల మమతారాజు, ఎంపీటీసీ మమతా మోహన్, ఉపసర్పంచ్ జంగా రాజిరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ గుడిపెల్లి ధర్మారెడ్డి, సీఈవో రాజయ్య, డైరెక్టర్లు శ్యామ్సుందర్రెడ్డి, బాబు, మాజీ చైర్మన్ జనార్దన్రెడ్డి, పీఏసీఎస్ సిబ్బంది సుధాకర్, ఓంకార్, రజినీకుమార్ పాల్గొన్నారు.
గీసుగొండ మండలం ఎలుకుర్తిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ సౌజన్య ప్రారంభించారు. డైరెక్టర్లు రామారావు, రాజు, ఐలోని జైపాల్, ఏఈవో విజయ్నాయక్, పాల్గొన్నారు. అలాగే. నల్లబెల్లి మండలంలోని నందిగామ, ముచ్చింపుల, అర్షనపెల్లి, కన్నారావుపేట, గోవిందాపూర్, నాగరాజుపల్లె, గుండ్లపహాడ్, మేడెపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సర్పంచ్లు ప్రారంభించారు. నల్లబెల్లిలో ఎంపీపీ ఊడుగుల సునీత ప్రారంభించి మాట్లాడారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తున్న కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాని కోరారు. కార్యక్రమాల్లో పీఏసీఎస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్రావు, సహకార శాఖ నోడల్ అధికారి శ్రీనివాసరావు, టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్గౌడ్, ఎంపీటీసీ జన్ను జయరావు, సీఈవో నాగెల్లి మొగిలి,
ఆర్బీఎస్ మండల కన్వీనర్ గోనెల పద్మా నరహరి, టీఆర్ఎస్ మండల నాయకుడు గందె శ్రీనివాస్గుప్తా, సర్పంచ్లు మామిండ్ల మోహన్రెడ్డి, ఎండీ నజీమా, పాండవుల రాంబాబు, నాగెళ్లి శ్రీనివాస్, దామ సాంబయ్య, ఉప సర్పంచ్ నాగేశ్వర్రావు, ఏఈవో శ్రీకాంత్ పాల్గొన్నారు. సంగెం మండలంలోని మొండ్రాయి, ఎల్గూర్రంగంపేట, బిక్కోజినాయక్తండా, నల్లబెల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ సుదర్శన్రెడ్డి ప్రారంభించారు. రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, సంగెం సొసైటీ చైర్మన్ కుమారస్వామియాదవ్, వైస్ చైర్మన్ కొట్టం రాజు, సర్పంచ్లు గూడ కుమారస్వామి, పోతుల ప్రభాకర్, మామిడాల సుదర్శన్, ఎంపీటీసీలు జనగాం పద్మ-శ్రీనివాస్, కట్ల సుమలతా నరేశ్, కోఆప్షన్ సభ్యుడు మన్సూర్ అలీ, నరేశ్, అనుముల ప్రతాప్, మాజీ ఎంపీటీసీ కడ్దూరి సంపత్, కార్యదర్శులు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
నాణ్యమైన ధాన్యం తీసుకురావాలి
నర్సంపేటరూరల్: రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకురావాలని జడ్పీటీసీ కోమాండ్ల జయ కోరారు. మండలంలోని కమ్మపల్లిలో సోమవారం జడ్పీటీసీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అందుబాటులో ఉన్న కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని రైతులను కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ వల్గుబెల్లి రంగారెడ్డి, ఎంపీటీసీ వల్గుబెల్లి విజయ, కోమాండ్ల గోపాల్రెడ్డి, ఎఫ్పీవో రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు పెండ్యాల మునేంధర్, ఉపాధ్యక్షుడు వల్గుబెల్లి జయపాల్రెడ్డి, డైరెక్టర్లు వల్గుబెల్లి మల్లారెడ్డి, సంకటి శ్రీనివాస్, దూపటి మధుసూదన్, మోకిరెడ్డి వీరారెడ్డి, అల్లి రాజు, తంగెళ్ల అశోక్, దామెర రాజ్కుమార్, మేర్గు రాజు, వల్గుబెల్లి ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు.