ఐనవోలు ఏప్రిల్ 11 : ఒకప్పుడు కరువుకు నిలయమైన వర్ధన్నపేట నియోజకవర్గం స్వరాష్ట్రంలో సస్యశ్యామలంగా మారిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పున్నేలు క్రాస్రోడ్డులోని సత్యం గార్డెన్లో బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అధ్యక్షతన మంగళవారం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి హాజరై మాట్లాడుతూ కార్యకర్తల కష్టసుఖాలు తెలుసుకొనేందుకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. కేంద్రం రూ.30 వేల కోట్లు ఇస్తామన్నా మోటర్లకు మీటర్లు పెట్టలేదని చెప్పారు. ఖాళీ స్థలం ఉన్న వారందరికీ ఇండ్లు కట్టిస్తామని పేర్కొన్నారు.
ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గం తెలంగాణ ప్రభుత్వ హ యాంలో సస్యశ్యామలంగా మారిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయార్రావు అన్నారు. పున్నేలు క్రాస్రోడ్డులోని సత్యం గార్డెన్ లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అధ్యక్షతన మంగళవారం జరిగింది. జడ్పీ చైర్మన్ సుధీర్బాబు, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఎమ్మెల్యేతో కలిసి ముందుగా ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనం అంటే కష్టసుఖాలను తెలుసుకోవాలని సూచించారు. 9 ఏండ్లలో మన ప్ర భుత్వం ఏం చేసింది, గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, ఇంకా జరగాల్సిన అభివృద్ధి, గత ప్రభుత్వాల పాలన గురించి చర్చించాలని పేర్కొన్నారు. మహిళలే కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్న విషయం గుర్తు చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇద్దరే ముఖ్యమంత్రులు ప్రజలకు మంచి చేశా రు.
ఒకరు ఎన్టీఆర్, మరొకరు కేసీఆర్ అన్నారు. ఎన్టీఆర్ ప్రజలకు రెండు రూపాయలకు కిలో బియ్యం అందించారు, తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రాష్ర్టాన్ని నాశనం చేశారని చెప్పా రు. ఇప్పుడు సీఎం కేసీఆర్ 57 ఏండ్లు నిండిన వారికి నెలకు రూ.2 వేల పింఛన్ అందిస్తున్న మహానుభావుడు అని కొనియాడారు. వచ్చే నెలలో కొత్త పింఛన్ల దరఖాస్తు కోసం ఆన్లైన్ ఓపెన్ చేస్తామని వివరించారు. పేద ప్రజలకు భరోసా కల్పించింది తెలంగాణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. వర్ధన్నపేట నియోజవర్గంలో తాను ఎమ్మెల్యేగా పని చేసినప్పుడు నీళ్లు, నిధులు, సంక్షేమ పథకాల కొరత ఉండేదని గుర్తుచేశారు. గ్రామాలకు వస్తుంటే నీళ్ల కోసం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డు మీదకు వచ్చేవాళ్లు. కా నీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. నీళ్లు, నిధులు సరిపడా వస్తున్నాయన్నారు. బీజేపీని నమ్మి మోసపోవద్దని సూచించారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత ఎమ్మెల్యే అరూరి, తనదేనన్నారు.
ప్రజలే బలం.. బలగం : ఎమ్మెల్యే అరూరి రమేశ్
వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలే తన బలం.. బలగం. జీవితాంతం వారి రు ణం తీర్చుకోలేనిదని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గతంలో చెప్పినట్లు నియోజకవర్గ పెద్దజీతగానికి పని చేస్తానని హామీ ఇస్తున్నా. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో చేసిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి చర్చించాలన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్తో కొట్లాడి నిధులను తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కానీ, ఇంకా చేయాల్సిన పనులు కొన్ని మిగిలిపోయాయి. సీఎం కేసీఆర్తో మాట్లాడి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు రూ.100 కోట్ల వరకు మంజూరు చేయాలని కోరినట్లు వెల్లడించారు. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ పేరుతో పేద విద్యార్థుల చదువుకు కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎజెండా లేని ప్రతిపక్ష పార్టీలు : డీసీసీబీ చైర్మన్ మార్నేని
బీజేపీ, కాంగ్రెస్కు ఒక నిర్దిష్టమైన ఎజెండా లేదని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు అన్నారు. జాతీయ పార్టీలుగా చెప్పకుంటున్న పార్టీలు గల్లీలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట చెబుతున్నాయని మండిపడ్డారు. తెలంగాణ పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేస్తానని చెప్పి ముందు సాగుతున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని గుర్తు చేశారు.
వర్ధన్నపేటలో వార్ వన్ సైడే : మారపల్లి సుధీర్కుమార్, జడ్పీ చైర్మన్
వర్ధన్నపేట నియోజకవర్గంలో వార్ వన్ సైడే అని జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్ అన్నారు. మాములుగా అయితే ప్రతిపక్ష నాయకులు అబద్ధాలు చెప్పడం చాలా చూశాం. కానీ, ప్రధానమంత్రిగా ఉన్న మోదీ సైతం తెలంగాణ ఎదుగుదలను చూసి ఓర్వలేక అబద్ధపు ప్రచారం చే యడం సరికాదన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో జడ్పీ వైస్ చైర్మన్ శ్రీరాములు, ఎంపీపీ మధుమతి, వైస్ ఎంపీపీ మోహన్, జడ్పీ కోఆప్షన్ మెంబర్ ఉస్మాన్అలీ, నియోజవర్గ సోషల్ మీడియా కన్వీనర్ అరూరి విశాల్, మండలాధ్యక్షుడు శంకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, నియోజకవర్గ అధికార ప్రతినిధి రవీందర్, సర్పంచుల ఫోరం, ఎంపీటీసీ ఫోరం మండలాధ్యక్షుడు దేవేందర్, సోమేశ్వర్రావు, సొసైటీ వైస్ చైర్మన్ల చందర్రావు, బాబు, డైరెక్టర్ శ్రీనివాస్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ సంపత్కుమార్, కోఆప్షన్ గుంషావలీ, ఆత్మ జిల్లా డైరెక్టర్లు రాజు, దేవేందర్, రాజు, నాయకులు దేవికారెడ్డి, కోమలత, సురేశ్, రాజు, నరేశ్, మధుకర్ పాల్గొన్నారు.
రమేశ్ అన్నను భారీ మెజార్టీతో గెలిపించుకుంటం
నా భర్త గత సంవత్సరం మరణించాడు. రైతుబీమా పథకానికి దరఖాస్తు చేసుకున్నా. మూడు నెలల వరకు రాలేదు. గ్రామనాయకులు, మండల నాయకుల సహకారం ఎమ్మెల్యే అరూరి దృష్టికి తీసుకవెళ్లారు. దీంతో వెంటనే స్పందించి ఎమ్మెల్యే అరూరి మా నియోజవర్గ ఆడబిడ్డ ఇబ్బందులు పడుతుంది. ఈ విధంగానైనా సహకరించాలని పై అధికారులతో మాట్లాడారు. మూడు రోజుల్లో ఐదు లక్షల రూపాయలు నా అకౌంట్లో పడ్డాయి. నాకు 8 ఏండ్ల పాప, 6 ఏండ్ల బాబు ఉన్నారు. మేము ఈ రోజు మూడు పూటల అన్నం తింటున్నామంటే కేవలం తెలంగాణ ప్రభుత్వం చలవే. దిక్కుతోచని స్థితిలో ఉండగా తెలంగాణ ప్రభుత్వం మాకు సాయం చేసింది. ఈ సాయం చేసిన ప్రభుత్వం, సహకరించిన ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నను గట్టి మెజార్టీతో మళ్లీ గెలిపించుకుంటాం.
– తాటికాయల సమత, ఉడుతగూడెం రైతు బీమా లబ్ధిదారు..