పరకాల, జనవరి 27 : సీఎం కేసీఆర్ పాలనలో ఇంటింటా సంక్షేమ పథకాలు అందుతున్నాయని, తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్గా నిలుస్తోందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో నడికూడ మండలం నర్సక్కపల్లి గ్రామానికి చెందిన బీజేవైఎం నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అహర్నిశలు కృషిచేస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం లబ్ధి పొందుతున్నదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, విద్యుత్ రంగాల్లో రాష్ట్రం దూసుకుపోతోందని, అభివృద్ధిలో దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు.
దేశంలోని అన్ని రాష్ర్టాల పాలకులు, ప్రజలు తెలంగాణ వైపు చూస్తున్నారని అన్నారు. అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు విపక్ష పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. యువత బీఆర్ఎస్ వైపే ఉందని, రాష్ట్రంలో ఇతర పార్టీలకు స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు. మతం పేరుతో బీజేపీ మభ్యపెడుతోందని విమర్శించారు. కేతపాక నాగరాజు, విష్ణు, శ్రావణ్, కూతురి రాకేశ్, బైరపాక రాజు, కోడెపాక రాజు తదితరులు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దురిశెట్టి చంద్రమౌళి, ఉపాధ్యక్షుడు కోడెపాక కుమారస్వామి, నాయకులు పాడి చంద్రారెడ్డి, తాళ్లపల్లి రవీందర్, వర్ణం శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు
పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు వారు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతిరెడ్డి మధుసూదన్రెడ్డి, సంఘం మండల అధ్యక్షుడు కలకొండ వెంకటేశ్వర్లు, నాయకులు సిద్ధోజు వెంకటేశ్వర్లు. బొజ్జ రవీంద్రాచారి, కలకొండ సాంబయ్య, సిద్ధోజు కృష్ణమూర్తి, వీరాచారి, సాంబమూర్తి, రాంప్రసాద్, బాలాజీ, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.