నమస్తేతెలంగాణ నెట్వర్క్ : వరంగల్, హనుమకొండ జిల్లాల వ్యాప్తంగా ఆదివారం భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు భోగి మంటలు వేసుకొని వేడుకల్లో పాల్గొన్నారు. హంటర్రోడ్డులోని మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంట్లో బొమ్మల కొలువు సందడి నెలకొంది. ఆయన సతీమణి వొడితల సరోజినీ దేవి, మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ సతీమణి డాక్టర్ షమిత, కుమార్తె డాక్టర్ పూజిత, కోడలు డాక్టర్ శంసిత బొమ్మల కొలువును తీర్చిదిద్దారు.
అలాగే, సుబేదారిలోని ఆర్ట్స్ కళాశాలలో గ్రేటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పతంగుల ఉత్సవం (కైట్ ఫెస్టివల్ )లో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పతంగులను ఎగురవేశారు. అదనపు కలెక్టర్ రాధికాగుప్తా, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, ఈవీ శ్రీనివాస్రావు పాల్గొన్నారు. అలాగే, నర్సంపేట మండలంలోని మహేశ్వరం శివారు గ్రీన్రీసార్ట్లో నిర్వహించిన కైట్ ఫెస్టివల్లో సినీనటులు మాధవీలత, గీతాసింగ్తోపాటు పలువురు కమెడియన్లు హాజరై సందడి చేశారు.
బీఆర్ఎస్ డివిజన్ నాయకుడు డాక్టర్ లెక్కల విద్యాసాగర్రెడ్డి, విద్యారెడ్డి, మేనేజర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. అలాగే, నర్సంపేటలో శాంతి సేనా రైతు సంఘం ఆధ్వర్యంలో పశువుల అందాల పోటీలు నిర్వహించారు. ఇందులో జోడెడ్లు, ఆవుదూడలు, కాడెడ్లు, ఆవులు, గొర్రె, మేక పోతులు, కోళ్లు పాల్గొన్నాయి. కాగా, మంత్రి కొండా సురేఖ హనుమకొండలోని తన ఇంటి ఎదుట ముగ్గులు వేసి, ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.