పోచమ్మమైదాన్, డిసెంబర్ 5: విద్యార్థులు భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేసినట్లయితే అందులోని సారాంశం జీవితంలో ఎంతో ఉపయోగపడుతుందని ప్రముఖ ఆధ్యా త్మికవేత్త సముద్రాల శఠగోపాచార్యులు అన్నారు. గీతా జయంతి ఉత్సవాల సందర్బంగా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మప్రచార పరిషత్ వరంగల్ శాఖ ఆధ్వర్యాన హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండ పంలో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద ర్భంగా జ్ఞానయోగం నాల్గవ అధ్యాయంపై నిర్వహించిన గీత శ్లోక కంఠస్థ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహు మతులను పంపిణీ చేశారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న శఠగోపాచార్యులు మాట్లాడుతూ ప్రతిరోజు విద్యార్థులు ఒక భగవద్గీత శ్లోకాన్ని కంఠస్థం చేస్తే వారు భవిషత్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారన్నారు. టీటీడీ క్లస్టర్ సూపరింటెం డెంట్ విపూరి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి సంవత్స రం మార్గశిర మాసంలో నిర్వహించు గీతా జయంతి ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులకు పోటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. న్యాయ నిర్ణేతలుగా తెన్నేటి వసుం దర, మచ్చమ్మ, అన్నావజ్జుల సోమశేఖర శర్మ, కోటా శ్రీనివాసరావు, టీ రవికుమార్ వ్యవహరించారు.
కంఠస్థ శ్లోకాల పోటీల విజేతలకు పుస్తకాల పంపిణీ..
గీతా జయంతి ఉత్సవాల్లో సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారిలో ప్రధమ బహుమతి రూ.1000, ద్వితీయ బహుమతి రూ.750. తృతీయ బహుమతి రూ.500 విలువైన రామాయణ, మహాభారత, భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రథమ బహుమతి జి.భార్గవి, ఆంధ్ర బాలికల పాఠశాల వరంగల్, ద్వితీయ బహుమతి సాయి కృష్ణ, తృతీయ బహుమతి కే ఉదయ్ కిరణ్ శారద హైస్కూల్ వరంగల్ గెలుపొందారు. సీనియర్ విభాగంలో ప్రథమ బహుమతి వీ సాహూ రామన్ హైస్కూల్, ద్వితీయ బహుమతి జీ గాయత్రి, తృతీయ బహుమతి వీ మీనాక్షీ శారద హైస్కూల్ వరంగల్ విజయం సాధించారు. అలాగే 18 ఏండ్లు పైబడిన వారిలో 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు అప్పగిం చిన శశికళ వరంగల్, 18 సంవత్సరాల లోపు జూనియర్ విభాగంలో జీ భార్గవి ఆరో తరగతి విద్యార్థిని 700 శ్లోకా లు అప్పగించారు. వీరికి రామాయణ, మహాభారత, భగవద్గీత పుస్తకాలను అందజేశారు.