వరంగల్, ఏప్రిల్ 25 : భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. మంగళవారం భద్రకాళి అమ్మవారు దుర్గామాతా అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల నాలుగో రోజు జగద్గురు శంకరాచార్య జయంతిని నిర్వహించారు. ఉదయం సింహ వాహనం, సాయంత్రం గజ వాహనంపై అమ్మవారిని ఊరేగించారు. ఆర్యవైశ్య గ్రేటర్ అధ్యక్షుడు గందె నవీన్-కల్పన దంపతులు, ఆర్యవైశ్య ప్రముఖులు దాచేపల్లి సీతారాం, బోడ్డు రవీంద్రనాథ్ తదితరులు పూజలు నిర్వహించారు.
వారికి ఈవో శేషుభారతి, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. సాయంత్రం నిర్వహించిన కల్యాణోత్సవానికి చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్-రేవతి దంపతులు హాజరయ్యారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చీఫ్ విప్ సంతృప్తి వ్యక్తం చేశారు. బహ్మోత్సవాల సందర్భంగా దేవాదాయ, ధర్మాదాయ శాఖ వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్ టీ కాంతారావు, అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.