వరంగల్ చౌరస్తా, ఆగస్టు3: వైద్య విద్యార్థులు చట్టాన్ని తెలుసుకొని తదనుగుణంగా మసులుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అన్నా రు. బుధవారం కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన వైట్ కోట్ సెర్మనీ 2021-22 కార్యక్రమంలో భా గంగా యాంటీ ర్యాగింగ్ చట్టంపై వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ అన్ని వృత్తుల్లో వైద్యు వృత్తి చాలా గొప్పదని అన్నారు. అంతటి గొప్ప వృత్తిని ఎంచుకున్న మీరు చట్టాన్ని తెలుసుకొని మ సులు కోవడం మూలంగా బంగారు భవిష్యత్కు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా ఆనందంగా ఉండవచ్చన్నారు. చట్ట ప్రకారం ర్యాగింగ్ శిక్షార్హమని అన్నారు. సీనియర్స్, జూనియర్స్ పట్ల ర్యాగింగ్కు పాల్పడ డం చట్టాన్ని అతిక్రమించినట్లే అవుతుందని అన్నా రు.
జూనియర్ల పట్ల అభ్యంతరకరంగా, అసభ్యంగా ప్రవర్తించడం, ఇబ్బంది పెట్ట డం, మత్తు పదార్ధాలకు బానిసలుగా మారడం లాంటి చర్యలకు పాల్పడవ ద్దని సూచించారు. పోలీసులు ఎప్పుడు బాధితులకు చట్ట ప్రకారం న్యాయం చేయడానికి మాత్ర మే చూస్తారని ఆయన అన్నారు. అత్యుత్సాహానికిపోయి జైలుపాలు కావొద్దని, జీవితాలను అంధకారం చేసుకోవ ద్దని అన్నారు. ఇటీవల జరుగుతున్న సైబర్ మోసాల్లో ఎక్కువగా చదవుకున్న వారే మోసపోతున్నారని అన్నారు. ఆన్లైన్ ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే ముందు వెబ్సైట్పై అవగాహన కలిగి ఉండా లని అన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాస్, ఎంజీఎం దవాఖాన సూపరింటెం డెంట్ డాక్టర్ చంద్రశేఖర్ వైద్య విద్యా విధానం పై విద్యార్ధులకు అవగాహన కల్పించా రు. వైట్ కోట్ ధరించి దైవంతో సమానమైన వైద్య వృత్తిలో అడుగు పెడుతున్న మీకు అంతా మంచి జరుగాలన్నారు. మనిషి ప్రాణాలు నిలిపే వృత్తిలో మీరందరూ మంచి గుర్తింపును కలిగి, ఉన్నత స్థాయిలో నిలవాలని కోరుకుంటు న్నా మని అన్నారు. విద్యాభ్యాసంపై దృష్టిని నిలిపి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూ చించారు. విద్యాభ్యాసంలో మీకు మా వంతు సహకారం అన్ని వేళలా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్ర మంలో కేఎంసీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకుమార్రెడ్డి, ఆర్ఈఎస్ సూ పరింటెండెంట్ గిరిధర్రెడ్డి, టీబీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్కుమార్, సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్కుమార్, వరంగల్ ఏసీపీ గిరికుమార్, పలువురు విభాగాధిపతులు, ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.
రక్తదానంతో తలసేమియా వ్యాధిగ్రస్తులను ఆదుకోవాలని వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్జోషి పిలునిచ్చారు. వరంగల్ డివిజినల్ పోలీసుల ఆధ్వర్యంలో శివనగర్లోని చైత్రరాధ గార్డెన్లో ఏర్పాటు చేసిన రక్తదానం శిబిరాన్ని సీపీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదానం చేయడానికి యువత ముందుకురావాలన్నారు. పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణతోపాటు సామాజిక బాధ్యతతో సేవ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్కుమార్, వరంగల్ ఏసీపీ గిరికుమార్, రెడ్క్రాస్ సభ్యుడు ఈవీ శ్రీనివాస్, మిల్స్కాలనీ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.