ఐనవోలు, డిసెంబర్ 4: మైనార్టీ గురుకులాల్లో విద్యార్థులకు డూబ్లికేట్ అడ్మిషన్లు సృష్టించిన వ్యక్తిని ఆరెస్టు చేసినట్లు మామునూరు ఏసీపీ నరేశ్కుమార్ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్లో పర్వతగిరి సీఐ శ్రీనివాస్, స్థానిక ఎస్సై వెంకన్నతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేల్ క్రాస్ వద్ద ఉన్న వర్ధన్నపేట మైనార్టీ గురుకులంలో అడ్మిషన్ కాపీని డూప్లికేట్ చేసి, ఫేక్ మెయిల్ ద్వారా అడ్మిషన్లు జరిగినట్లు ప్రిన్సిపాల్ వాస్కుల రాజు గత నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐ, ఎస్సై దర్యాప్తు చేశారు. సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం కూటిగల్ రెడ్యానాయక్ తండాకు చెందిన భూక్యా సుమన్ ఓ ఏజెన్సీ నుంచి ఔట్ సోర్సింగ్లో 2017లో కంప్యూటర్ ఆపరేటర్గా వర్ధన్నపేట మైనార్టీ గురుకులంలో విధుల్లో చేరాడు.
గురుకులంలో 80 శాతం సీట్లు మైనార్టీలకు, మిగిలిన 20 శాతం నాన్ మైనార్టీలకు కేటాయిస్తారు. విద్యార్థులకు అడ్మిషన్ కావాలంటే టీఎంఆర్ఈఐఎస్ సెక్రటరీ హైదరాబాద్ నుంచి సంబంధిత సీట్లు ఖాళీ ఉన్న గురుకులాలకు academics. tmreis @gmail.com మెయిల్ వస్తుంది. దీని ఆధారంగా విద్యార్థులకు ప్రిన్సిపాల్స్ అడ్మిషన్లు ఇస్తారు. ఉన్నతాధికారుకుల పర్యవేక్షణ లోపం ఉన్నట్లు సుమన్ గమనించాడు. ఫేక్ అడ్మిషన్ కాపీ సృష్టించి విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేయాలనుకున్నాడు. గతంలో టీఎంఆర్ఈఐఎస్ సెక్రెటరీ హైదరాబాద్ నుంచి వచ్చిన మెయిల్ను కాపీని డూబ్లికేట్ చేసి acedamics. tmreis@ gmail.com టీఎంఆర్ఈఐఎస్కున్న ప్రభు త్వ మెయిల్ academics లో సెమ్ అర్థం వచ్చేలా రెండు పదాలు మార్చి acedamics అడామిక్లో ‘A’ ఉన్న చోట E,..‘E’ ఉన్న చోట ‘A’ ఏర్పాటు చేసి ఉచ్ఛారణ మా త్రం అలాగే ఉండేలా మెయిల్ క్రియేట్ చేసి డూబ్లికేట్ అడ్మిషన్ అర్డన్ కాపీలతో అడ్మిషన్లు ఇచ్చారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట, పర్కాల, స్టేషన్ ఘన్పూర్, మహబూబాబాద్, జనగామ, తొర్రూరు, డోర్నకల్ తదితర గురుకులాల్లో సుమారుగా 90 విద్యార్థులకు 18 డూబ్లికేట్ అర్డర్ కాపీలతో అడ్మిషన్లు కల్పించారు. హనుమకొండ గురుకులం అడ్మిషన్ల విషయంపై ప్రిన్సిపాల్ సతీశ్ ఫెక్ మెయిల్గా గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు విజిలెన్స్ అధికారుకుల దృష్టికి తీసుకెళ్లారు. డూబ్లికేట్ అర్డర్తో అడ్మిషన్ జరిగినట్లు ఐనవోలు పోలీసు స్టేషన్లో నమోదైన కేసులో దర్యాప్తు చేశారు. పర్వతగిరి సీఐ శ్రీనివాస్, ఎస్సై వెంకన్న నిందితుడిని అదుపులోకి తీసుకొని సుమన్ను విచారించారు. 18 డ్లూబికేట్ అడ్మిషన్లతో సుమారు రూ. 18 లక్షల 75 వేలు వసూలు చేశారని వెల్లడైంది. నిందితుడి నుంచి రూ. 2 లక్షల నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ నరేశ్కుమార్ వెల్లడించారు. కేసును దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసిన పర్వతగిరి సీఐ శ్రీనివాస్, ఎస్సై వెంకన్న, కానిస్టేబుల్స్ నాగరాజు, రాజును ఆయన అభినందించారు.