ఖిలావరంగల్, జనవరి 21: జిల్లాలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బీ గోపి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్షించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులకు కేటాయించిన పనులు చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కలెక్టరేట్ లేదా ఖిలావరంగల్ ఖుష్మహాల్ ప్రాంగణంలో ఎక్కడైనా రిపబ్లిక్ వేడుకులు నిర్వహించే అవకాశం ఉందన్నారు.
ముఖ్య అతిథి ప్రసంగం, సాంసృతిక కార్యక్రమాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేసేలా చూడాలని డీపీఆర్వోను ఆదేశించారు. సాంసృతిక కార్యక్రమాల నిర్వహణ, సర్టిఫికెట్ల ప్రదానం తదితర విషయాలపై డీఈవో, డీపీఆర్వో సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. పోలీసు శాఖ ద్వారా గాడ్ ఆఫ్ ఆనర్, బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను కోరారు. అలాగే, వేడుక ప్రదేశాన్ని చదును చేయడం, వేదిక అంకరణను సకాలంలో పూర్తి కావాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అశ్వినీ తానాజీ, శ్రీవత్స కోట, డీసీపీ వెంకటలక్ష్మి, ఆర్డీవో మహేందర్జీ, డీఆర్డీవో సంపత్రావు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దు
మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ గోపి అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్లో పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. టెండర్లు, అగ్రిమెంట్లు అంటూ కాలయాపన చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. మోడల్ గ్రామ పంచాయతీగా పేరుగాంచిన గంగదేవపల్లి వంటి గ్రామంలో పనులు సరిగా జరగకపోవడానికి గల కారణాలు తెలియజేయాలని, అలాగే సంబంధిత ప్రత్యేక అధికారి, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ డీఈలు, ఏఈలు సమస్యను పరిషరించాలన్నారు.
మండలస్థాయిలో మనఊరు-మనబడి పనుల పురోగతిపై సమావేశాలు నిర్వహించుకొని, సమావేశంలో పేరొన్న అంశాలను రికార్డు చేసి అందించాలని అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిపై ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించామని, అప్పటి నుంచి కొంచెం వేగం పుంజుకుందన్నారు. జిల్లాలో కంటివెలుగును అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించాలన్నారు. సమీక్షలో డీఈవో డీ వాసంతి, డీపీవో కల్పన పాల్గొన్నారు.
పెండింగ్ ఆడిట్ పేరాలను పరిష్కరించాలి
జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా చేపట్టిన పనుల పెండింగ్ ఆడిట్ పేరాలను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం సోషల్ ఆడిట్, సీసీరోడ్లు, జీపీల ఆధార్ సీలింగ్, నర్సరీ ప్లాంటేషన్పై కలెక్టర్ సమీక్షించారు. అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. జీపీ, అంగన్వాడీ భవనాలు, సీసీరోడ్ల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. డీఆర్డీవో సంపత్రావు పాల్గొన్నారు.