ఖిలావరంగల్, మార్చి 15: వినియోగదారుల హకుల రక్షణ అందరి బాధ్యత అ ని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురసరించుకొని కలెక్టరేట్లో శుక్రవారం వినియోగదారుల కోసం న్యాయమైన, బాధ్యతాయుతమైన కృత్రిమ మేధస్సు అనే అంశంపై సమావేశం నిర్వహించారు. అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు.
పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ సం ధ్యారాణి, జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి ప్రవీణ్కుమార్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కృష్ణమూర్తి, పరిశ్రమల శాఖ జీఎం సిద్ధార్థరెడ్డి, డీసీఐసీ అధ్యక్షుడు సుదర్శన్, ఓరుగల్లు సీపీసీ అధ్యక్షుడు దామోదర్, జనరల్ సెక్రటరీ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.