వరంగల్, నవంబర్ 28(నమస్తేతెలంగాణ) : ప్రస్తుతం వానకాలం ధాన్యాన్ని మ ద్దతు ధరతో రైతుల నుంచి నేరుగా కొనేందు కు ప్రభుత్వం నిర్ణయించింది. రైతులు వానకాలం పండించిన వరి పంట నుంచి ప్రతి గింజా కొంటామని స్పష్టం చేసింది. ఈ మే రకు అధికారులు ధాన్యం కొనుగోలుకు ప్ర ణాళిక రూపొందించారు. జిల్లాలో రైతుల నుంచి నేరుగా మద్దతు ధరతో 2.60 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉం టుందని అంచనా చేశారు. ఈ ధాన్యం కొ నేందుకు గత వానకాలం మాదిరిగా గ్రామా ల్లో 172 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మొదట అధికారులు ప్రతిపాదించారు. ఇటీవల జిల్లాలో వానకాలం ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్ బీ గోపి గతం కంటే ఈసారి ధాన్యం దిగుబడులు పెరుగనున్నందున అవసరమై న గ్రామాల్లో అదనపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆ దేశించారు. దీంతో కొద్దిరోజుల క్రితం అధికారులు అదనంగా మరో 8 కేం ద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించా రు. వీటితో ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య 180కి పెరిగింది. తాజాగా మరికొన్ని గ్రామాల్లో అదనపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి. రైతులకు ఇబ్బందులు కలుగకుండా వానకాలం ధాన్యం కొనుగోలు జరుగాలని చెబుతున్న ప్రభుత్వం అదనంగా ఇంకో 12 కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించింది. దీంతో జిల్లాలో ఏర్పాటు చేసే వానకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య ఆదివారం వరకు 192కి చేరింది.
ఎక్కువగా పీఏసీఎస్లకు..
జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసే 192 కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువగా ప్రభుత్వం పీఏసీఎస్లకు కేటాయించింది. అత్యధికంగా 108 కేంద్రాలను పీఏసీఎస్లకు కేటాయిస్తే ఆ తర్వాత 48 కేంద్రాలను ఐకేపీలకు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. మిగతా వాటిలో ఓడీసీఎంఎస్కు 9, ఏఎంసీలకు 2, జీసీసీకి 1, ఇతరులకు 24 కేటాయించామని తెలిపారు. వీటిలో 87 సెంటర్లు ప్రారంభమయ్యాయని, వీటిలో 43 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కూడా జరుగుతున్నదని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ భాస్కర్రావు ‘నమస్తేతెలంగాణ’కు చెప్పారు. ఆదివారం వరకు ఈ సెంటర్లలో సుమారు ఐదు వేలకు పైగా టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇతర జిల్లాల నుంచి వానకాలం ధాన్యం ఇక్కడ్లకు రాకుండా వరంగల్-ఖమ్మం రూట్లో రాయపర్తి, నర్సంపేట నుంచి మహబూబాబాద్ వెళ్లే ప్రధాన రహదారిలో ఖానాపురం, మల్లంపల్లికి చేరుకునే ఎన్హెచ్పై నల్లబెల్లి వద్ద అధికారులు అంతర్ జిల్లా చెక్పోస్టులను ఏర్పాటు చేశారు.
ఐదు సెక్టార్లు..
సెంటర్లలో రైతుల నుంచి కొన్న వానకాలం ధాన్యాన్ని రైస్మిల్లులకు తరలించేందుకు పౌరసరఫరాల సంస్థ అధికారులు జిల్లాలో ఐదు సెక్టార్లను గుర్తించారు. నెక్కొండ, ఖానాపురం, నల్లబెల్లి, పర్వతగిరి, వర్ధన్నపేట కేంద్రంగా ఈ సెక్టార్ల నుంచి రైస్మిల్లులకు ధాన్యం రవాణా జరుగుతుంది. నెక్కొండ సెక్టార్లో నెక్కొండ, చెన్నారావుపేట, గీసుగొండ మండలాలు, నల్లబెల్లి సెక్టార్లో నల్లబెల్లితో పాటు నర్సంపేట, దుగ్గొండి మండలాలు, వర్ధన్నపేట సెక్టార్లో వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, ఖిలావరంగల్, వరంగల్ మండలాలు ఉన్నాయి. ఖానాపురం, పర్వతగిరి సెక్టార్లలో ఒక్కో మండలం మాత్రమే ఉండడం గమనార్హం. మొదట జిల్లాలోని సెంటర్లలో కొన్న వానకాలం ధాన్యాన్ని ఎనిమిది సెక్టార్ల ద్వారా రైస్మిల్లులకు రవాణా చేయాలని నిర్ణయించగా, ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లు కొన్ని సెక్టార్ల నుంచి ధాన్యం రవాణాకు నిరాసక్తత కనబర్చడంతో అధికారులు సెక్టార్లను ఐదుకు తగ్గించినట్లు తెలిసింది. ఈ క్రమంలో వర్ధన్నపేట సెక్టార్ పరిధిలోని ఐదు మండలాల ధాన్యం రవాణాను ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్స్ అసోసియేషన్కు అప్పగించినట్లు సమాచారం. జిల్లాలో రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని సీఎంఆర్ కోసం 80 రా రైస్మిల్లులకు కేటాయించేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్ణయించారు.