హనుమకొండ చౌరస్తా, మే 29 : కేయూ ఒక దేవాలయం.. అందరి సహకారంతో వర్సిటీని అభివృద్ధి చేస్తానని ఇన్చార్జి వీసీ వాకాటి కరుణ అన్నారు. రిజిస్ట్రార్ మల్లారెడ్డితో కలిసి సెనేట్హాల్లో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యలను పరిషరించుకుందామని, నిర్మాణాత్మక ఎజెండాతో ముందుకు పోవాలన్నారు. జిల్లా అధికారుల సహాయంతో కాంపౌండ్ వాల్, పారిశుధ్య పనులు పూర్తి చేద్దామన్నారు. భూ ఆక్రమణదారులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. బోధనేతర ఉద్యోగ సంఘాల నాయకులు పలు సమస్యలపై ఇన్చార్జి వీసీకి వినతిపత్రం అందజేశారు. ప్రధాన కార్యదర్శి వల్లాల తిరుపతి, తోట ప్రభాకర్, అబ్దుల్ షూకూర్, కొర్నేల్, వేణు, రామనాథం, మల్లికాంబ పాల్గొన్నారు. అలాగే కేయూలో అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని అకుట్ జనరల్ సెక్రటరీ మామిడాల ఇస్తారి ఆధ్వర్యంలో వీసీ దృష్టికి తీసుకువచ్చారు. మాజీ వీసీ టీచర్లకు మూడో, నాలుగవ పదోన్నతుల ఏరియర్స్ ఇప్పటివరకు ఇవ్వలేదని, పదోన్నతుల అప్లికేషన్ల స్రూటినీ పూర్తి చేసి ప్రమోషన్ ఇవ్వాలన్నారు.
సీనియారిటీ ప్రకారం రెగ్యులర్ టీచర్లకు హెడ్షిప్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొన్ని విభాగాల్లో బీవోఎస్ చైర్మన్లను కూడా అక్రమంగా నియమించారని, సోషియాలజీలో వెంటనే హెడ్, బీవోఎస్ చైర్మన్లుగా అర్హత ఉన్న సీనియర్ టీచర్లకు ఇవ్వాలని కోరారు. అకుట్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బ్రహ్మేశ్వరి, జాయింట్ సెక్రటరీ కిశోర్కుమార్, ఈసీ సభ్యుడు రమేశ్ ఉన్నారు. అలాగే వర్సిటీలో సమస్యలను వెంటనే పరిషరించాలని కేయూ పీడీఎస్యూ ప్రధాన కార్యదర్శి మర్రి మహేశ్ డిమాండ్ చేశారు. యూనివర్సిటీ సమస్యలపై వాకాటి కరుణకు వినతి పత్రం అందజేశారు. గత వీసీ రమేశ్ యూనివర్సిటీని భ్రష్టు పట్టించారని, మెస్కార్డు డిపాజిట్ పేరుతో రూ.2 వేల నుంచి డిపాజిట్లను రూ.12 వేలకు పెంచి విద్యార్థులపై మోయలేని భారం వేశాడని వెంటనే వీటిని తగ్గించాలన్నారు. యూనివర్సిటీ భూములు కబ్జా అవుతుంటే పట్టించుకోలేదని, కనీసం ల్యాబ్స్ కూడా లేనిస్థితి యూనివర్సిటీలో ఉందన్నారు. ప్రొఫెసర్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలను నియమించి ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.