వరంగల్ లీగల్, జనవరి 23 : బాలికపై లైంగికదాడి, హత్య కేసులో నిందితుడికి జీవితకాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ హనుమకొండ అదనపు జిల్లా న్యాయమూర్తి టీ జయలక్ష్మి సోమవారం సంచలన తీర్పు వెలువరించారు. రాష్ట్రంలో ఒకేరోజు ఇద్దరిపై లైంగిక దాడి, హత్య జరుగడంతో ఇది సంచలన కేసు గా నిలిచింది. నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలంటూ వరంగల్లో ప్రదర్శనలు కూడా జరిగాయి. ఈ కేసును త్వరితగతిన విచారించడం కోసం స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అనేక సంచలన కేసుల్లో వాదించిన ఎం సత్యనారాయణను ప్రభుత్వం నియమించింది. వీరికి తోడుగా విశ్రాంత పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ సర్దార్ ఈ కేసులో మృతురాలి తరఫున వాదించారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండలోని ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో మృతురాలు తన తల్లిదండ్రులకు చెందిన కూరగాయల దుకాణంలో సహాయకారిగా ఉండేది.
ఇంటర్ చదివే ఈ విద్యార్థినికి ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న నిందితుడితో పరిచయం ఏర్పడింది. స్టేషన్ఘన్పూర్ మండలం నమిలిగొండకు చెందిన నిందితుడు పులి సాయికుమార్ ఆ పరిచయాన్ని ఆస రా చేసుకొని నిత్యం సెల్ఫోన్లో మాట్లాడుతూ ఆమె తో స్నేహం పెంచుకున్నాడు. ఈ క్రమంలో తన పుట్టినరోజు 2019 నవంబర్ 27న విద్యార్థిని గుడికి వెళ్దా మని నిందితుడికి ఫోన్ చేసింది. గుడికి తీసుకెళ్తాను అంటూ తన కారులో ఎకించుకొని గుడికి బదులుగా రాంపూర్ సమీపంలోని రైల్వే ట్రాక్ సమీపంలోకి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఈ క్రమంలో తీవ్ర రక్తస్రావం కావడంతో విద్యార్థిని అకడికకడే చనిపోయింది.
నిందితుడు ఆ శవాన్ని ఆ కారులో వే సుకుని సాయంత్రం వరకు పెండ్యాల, తరిగొప్పుల, హుస్నాబాద్, ఎల్కతుర్తి తదితర ప్రాంతాల్లో తిరిగాడు. సాయంత్రం వేళ ఒక బట్టల షాపులో కొత్త బట్టలు కొని శవంతో సహా శాయంపేట శివారుకు వెళ్లి అకడ రక్తపు మరకలు అంటి ఉన్న బట్టలు తీసేసి కొ త్త బట్టలు తొడిగాడు. లైంగికదాడి, హత్యను పకదారి పట్టించి సహజ మరణంగా చిత్రీకరించేందుకు ఆ ఫంక్షన్హాల్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో శవాన్ని వదిలి పారిపోయాడు.
చెల్లెలు ఇంటికి రాలేదని ఆమె సోదరుగు గడ్డం శ్రీనివాస్ అంతటా వెతికాడు. విగత జీవిగా పడి ఉండడాన్ని చూసి ఆమెతో చనువుగా ఉండే నిందితుడిపై అనుమానంతో సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అప్పటి సుబేదారి ఇన్స్పెక్టర్ సీహెచ్ అజయ్కుమార్ ఈ కేసును దర్యాప్తు చేసి, నిండితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తన నేరాన్ని పోలీసులు ఎదుట అంగీకరించాడు. నిందితుడికి వ్యతిరేకంగా సరైన సాక్షాధారాలు సేకరించి కోర్టు ముందు ఉంచడంతో న్యాయమూర్తి ఈ సంచలమైన తీర్పును సోమవారం వెలువరించారు.
విద్యార్థినిని అపహరించి, లైంగిక దాడి చేసి సాక్షాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినందుకు 27 సంవత్సరాలు జైలు శిక్ష, చావుకు కారణమైనందుకు యావజ్జీవ జైలు శిక్ష విధించారు. ఈ శిక్షలతో పాటుగా నాలుగు లక్షల రూపాయలను జరిమానా చెల్లించాలంటూ తీర్పులో పేరొన్నారు. మూడు లక్షల రూపాయలను మృతురాలి తల్లికి పరిహారంగా చెల్లించాలని ఆదేశించారు. ఈ కేసులో కోర్టు డ్యూటీ ఆఫీసర్ వీ రాజు, లైసన్ ఆఫీసర్ వెంకటస్వామి, ప్రస్తుత సుబేదారి ఇన్స్పెక్టర్ షుకూర్ నిందితుడికి వ్యతిరేకంగా కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టారు. సంచలన కేసులో కఠిన శిక్షలతో పాటు మృతురాలి తల్లికి రూ.3 లక్షల పరిహారాన్ని ఇవ్వాలంటూ ఆదేశించిన న్యాయమూర్తి తీర్పును అందరూ ఆహ్వానించారు.