హసన్పర్తి, ఏప్రిల్ 15: కానిస్టేబుల్ ఉద్యోగం రాలేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అర్వపల్లిలో సోమవారం జరిగింది. సీఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. హసన్పర్తి మండలం అర్వపల్లికి చెందిన ఆకుల రంజిత్ (30) 2022 సంవత్సరం, ఆ తర్వాత మూడు సార్లు కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు ఐప్లె చేసినప్పటికీ ఎందులోనూ సెలెక్ట్ కాలేదు.
దీంతో ఉద్యోగం రాలేదని నాలుగు నెలలుగా రందితో ఉంటున్నాడు. సోమవారం ఉదయం 10 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో లుంగీతో ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇవ్వగా చేరుకున్న సిబ్బంది అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.