వాజేడు, మార్చి11 : మండలంలోని గుమ్మడిదొడ్డి జీపీ పరిధి ఇప్పగూడెం, సుందరయ్యకాలనీ గ్రామాలకు వైద్య బృందం వచ్చింది. ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘విస్తరిస్తున్న జ్వరాలు’ కథనానికి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించారు. సోమవారం హెల్త్ సూపర్వైజర్ కోటిరెడ్డి నేతృత్వంలో హెల్త్ అసిస్టెంట్లు శేఖర్, చిన్న వెంకటేశ్వ ర్లు ఆశ వర్కర్లతో కలిసి ఆయా గ్రామాల్లో ఇంటింటా సర్వే నిర్వహించారు.
జ్వరాలు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారిని గుర్తించి రక్త నమూనాలు సేకరించి మందులను అందజేశారు. జ్వరాలతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. మురుగు కాలువల్లో యాంటీ లార్వాను పిచికారీ చేయించారు. సుందరయ్యకాలనీ గ్రామంలో మురుగు కాలువలో పేరుకపోయిన చెత్తను కార్యదర్శి రేఖశ్రీ పర్యవేక్షణలో పంచాయతీ సిబ్బంది శుభ్రం చేశారు. అంతేకాకుండా ఇండ్లు, మురుగు కాలువల చుట్టూ బ్లీచింగ్, పారిశుధ్య పనులు చేపట్టారు. బావుల్లో క్లోరినేషన్ పనులు చేశారు.