జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) పోలీసుల తనిఖీల్లో 975 గ్రాముల గంజాయి పట్టుబడగా ముగ్గురిని అరెస్టు చేశారు. భూపాలపల్లి సీఐ సీహెచ్ రాజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఎస్సై ప్రశాంత్ పోలీసు సిబ్బందితో కలిసి కేటీకే 5వ గని ఆర్చి క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పెట్రోలింగ్ చేస్తున్నాడు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద 975 గ్రాముల గంజాయి లభించింది. వీరిని విచారించగా గణపురం మండలం బొబ్బిలోనిపల్లికి చెందిన నేరెళ్ల ప్రవీణ్ చత్తీస్గఢ్ రాష్ర్టానికి చెందిన షేక్ చాందినిఖాన్ వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. దీనిని భూపాలపల్లిలో అవసరమున్న వారికి ఎక్కువ ధరకు అమ్ముతున్నాడని సీఐ తెలిపారు.
ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని కృష్ణకాలనీకి చెందిన మహ్మద్ షాకీర్, జవహర్నగర్ కాలనీకి చెందిన అటకాపురం రాకేశ్కు గంజాయి అమ్మడానికి కేటీకే 5వ గని ఆర్చి వద్ద ఉండగా నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ రాజిరెడ్డి తెలిపారు. ఎవరైనా గంజాయి విక్రయించినా, వినియోగించినా భూపాలపల్లి పోలీసులకు తెలుపాలని, డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.