భీమదేవరపల్లి, ఆగష్టు 19 : మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో కలిసి శనివారం ఓటు హక్కు అవగాహనపై 5కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని నినాదాలు చేశారు. ఓటు మాత్రమే ప్రజల ఆయుధమని, ఎలాంటి ప్రలోబాలకు తావివ్వకుండా నిస్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ఎంపీపీ జక్కుల అనితారమేశ్, ఎంపీటీసీలు సాతూరి రమ, షరీఫొద్దీన్, తహసీల్దార్ వెంకటభాస్కర్, ముల్కనూరు ఎస్సై నండ్రు సాయిబాబు, ఆర్ఐ నర్సింహానాయక్, విద్యార్థులు పాల్గొన్నారు.