నర్సంపేట, నవంబర్9: రైతులు అనుకోని పరి స్థితిలో మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడొద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా పథ కాన్ని తీసుకొచ్చారని, దీంతో వారి కుటుంబాలకు ధీమా వస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుద ర్శన్రెడ్డి అన్నారు. బుధవారం నర్సంపేటలోని ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నర్సంపేట ని యోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన 47 మంది రైతు కుటుంబాలకు రూ. 2.35 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటి వరకు మృతి చెందిన 785 రైతు కు టుంబాలకు రూ.39.25 కోట్ల విలువైన చెక్కుల ను అందించినట్లు తెలిపారు.
అకాలంగా మృత్యు వాత పడిన రైతుల కుటుంబాలకు ఆర్థిక భరో సాను ఇచ్చి అండగా నిలచే అద్భుతమైన పథకం రైతు బీమా అని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కష్టకాలంలో రైతు కుటుంబాన్ని ఆ దుకుని అక్కున చేర్చుకుంటున్నది రాష్ట్ర ప్రభు త్వం అని అన్నారు. ఉచిత కరెంటు, పెట్టుబడి సా యంతో పాటు, రైతు మరణించిన కొద్ది రోజుల్లోనే రైతుబీమా చెక్కు వారి కుటుంబానికి రూ.5 లక్షల విలువైన చెక్కును వ్యవసాయశాఖ ద్వారా అంద జేస్తున్నదని అన్నారు. రైతు కుటుంబానికి అండ గా నిలుస్తున్న ప్రభుత్వంగా మనమంతా గర్వించా లని కోరారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రతి కుటుం బానికి ఏదో ఒక సంక్షేమ పథకం రూపంలో వా రికి లబ్ధి చేకూర్చేలా పాలన సాగుతోందని పేర్కొ న్నారు. వ్యవసాయాన్ని గాడిలో పెట్టిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్దేనని కొనియా డారు. సాగునీటి రంగాన్ని ఆధునీకరించి రైతు ఆ ర్థికంగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నారని పే ర్కొన్నారు. ఇదే ఉత్సాహంతో సకల జనుల ఆశీ స్సులతో ఆదర్శవంతమైన ప్రభుత్వంగా నిలి చేందుకు మరింత కృషి చేస్తామని తెలిపారు. వ్యవసాయ శాఖ కృషితో నర్సంపేట నియోజకవర్గ రైతాంగం వ్యవసాయాధారిత ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు సక్రమంగా జరుగుతున్న సంద ర్భంగా వారిని అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో పని చేయాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, పత్తినాయక్, నామాల సత్యనారాయణ, నల్లా మనోహర్రెడ్డి, మోతె జైపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.