సంగెం, ఫిబ్రవరి 26 : గ్రామాభివృద్ధికి ప్రజలు సహకరించాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని కాట్రపల్లి గ్రామంలో రోడ్డు విస్తరణ పనులను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన 33 కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరు పత్రాలు ఇచ్చామని తెలిపారు. ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలని సూచించారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని రోడ్డు విస్తరణ పనులు చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ పులుగు సాగర్రెడ్డి పాల్గొన్నారు.