నర్సంపేట రూరల్, డిసెంబర్ 9 : నర్సంపేటలోని అయ్యప్పస్వామి ఆలయ 23వ మండల పూజ మహోత్సవం సందర్భంగా శనివారం పం బారట్టు ఉత్సవం అత్యంత వైభవంగా సాగింది. గురుస్వామి సీ వెంకటేశ్శర్మల వేద మంత్రోచ్ఛారణల నడుమ వేలాది మంది మాలధారులతో మా దన్నపేట పెద్ద చెరువు కిటకిటలాడగా, ఆ ప్రాంతమంతా అయ్యప్ప శరణుఘోషతో మార్మోగింది. కేరళలోని పంపానది తరహాలో ఇక్కడ కూడా నియమనిష్టలతో అయ్యప్పకు జలక్రీడలు నిర్వహించగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం ఆద్యంతం కనులపండువగా జరిగింది. తొలుత అయ్యప్ప ఆలయంలో పెద్ది ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అయ్యప్పను అలంకరించిన ఊరేగింపు వాహనంపై ప్రతిష్ఠించారు. నర్సంపేట-వరంగల్ రోడ్డులోని అయ్యప్ప దేవాలయం నుంచి వేలాది మంది దీక్షాపరులు, భక్తుల ఆధ్వర్యంలో స్వామి ఊరేగింపు వైభవంగా ప్రారంభమైంది. పెద్ది సుదర్శన్రెడ్డి స్వయంగా వాహనం నడిపారు.
ఆలయం నుంచి ప్రారంభమైన ఊరేగింపు వరంగల్ రోడ్డు, అంగడిసెంటర్, అంబేద్కర్ సెంటర్, జయలక్ష్మీ సెంటర్, కమలాపురం మీదుగా మాదన్నపేట పెద్ద చెరువు కట్టవద్దకు సాగింది. మాలధారుల భజనలు, బాణాలు, కత్తులు చేతబూని డప్పుచప్పుళ్ల, మంగళవాయిద్యాల మధ్య ఐదు గంటల పాటు ఊరేగింపు నిర్వహించగా మహిళలు మంగళహారతులతో ఎదురొచ్చి కొబ్బరికాయలు కొట్టి భక్తిభావాన్ని చాటుకున్నారు. అనంతరం చెరువు వద్ద 3గంటల పాటు జలక్రీడలు ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామికి తేనె, పండ్లు, జీడిపప్పు, చెక్కర, పెరుగు, పాలు, క్షీరం, కొబ్బరినీరు, విభూది, పసుపు, గంధం, వివిధ రకాల పుష్పాభిషేకాలు నిర్వహించి పట్టు వస్ర్తాలతో స్వామిని అలంకరించారు.
10వేల మందికి సహాపంక్తి భోజనాలు
జల క్రీడలు పూర్తయిన తర్వాత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అందించిన పంబా సద్ది(మహా అన్నదానం)ని చెరువు కట్టపై మాలధారులు, భక్తులు సమారు 10వేల మంది సహపంక్తి భోజనం చేశారు. నర్సంపేట ఏసీపీ పుప్పాల తిరుమల్ ఆధ్వర్యంలో నర్సంపేట టౌన్, రూరల్, నెక్కొండ సీఐలు భారీ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుంటి రజిని-కిషన్, వైస్ చైర్మన్ మునిగాల వెంకట్రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ మాధవశంకర్, ఎంపీపీలు కళావతి, ప్రకాశ్రావు, సునీత, జడ్పీటీసీలు జయ, పత్తినాయక్, పీఏసీఎస్ చైర్మన్ మోహన్రెడ్డి, కౌన్సిలర్లు గోల్యానాయక్, నాగిశెట్టి పద్మ, రాంబాబు, రాజుయాదవ్, తిరుమల, రమాదేవి, రాయిడి కీర్తిరెడ్డి, పాషా పాల్గొన్నారు.