వరాల తల్లీ దీవించు.. కోర్కెలు నెరవేర్చి చల్లగా చూడాలంటూ మహిళలు మనసారా వేడుకున్నారు. శ్రావణ శుక్రవారాన ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వరలక్ష్మీ వత్రాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వివిధ ఆలయాల్లో కుంకుమార్చనలు, అభిషేకాలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు.
ముఖ్యంగా భద్రకాళీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొందరు తమ ఇళ్లలోనే లక్ష్మీదేవతను ప్రత్యేకంగా అలంకరించి నైవేద్యం సమర్పించారు. అనంతరం తోటి ముత్తయిదువులను పిలిచి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. సకల శుభాలు, ఐశ్యర్యం కలగాలని రోజంతా ఉపవాసం ఉండి.. భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవతను ఆరాధించారు.
– నమస్తే నెట్వర్క్, ఆగస్టు 25