అమరావతి : తూర్పుగోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సామర్లకోట మండలం ఉండూరు వద్ద లారీ బీభత్సం సృష్టించింది. గురువారం అర్ధరాతి 2 గంటల సమయంలో ఇద్దరు పెట్రోలింగ్ పోలీసులపైకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మృతులను హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, హోంగార్డు ఎన్ఎస్రెడ్డిగా గుర్తించారు. వీరిద్దరూ విజయవాడ నుంచి వస్తున్న కరోనా వ్యాక్సిన్ వాహనానికి ఎస్కార్ట్గా వెళ్లారు. ఈ క్రమంలో ఉండూరు వంతెన వద్ద వాహనం కోసం నిరీక్షిస్తున్న క్రమంలో లారీ వచ్చి ఢీకొట్టింది. మృతులు కాకినాడ తిమ్మాపురం పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్యూటీ కోసం వెళ్లి ఇద్దరిని లారీ రూపంలో మృత్యువు కబళించడంతో విషాదం నెలకొంది.