హైదరాబాద్: తెలంగాణ భీం ఆర్మీ అధ్యక్షుడు సుజిత్ రావణ్పై దుండగులు దాడికి పాల్పడ్డారు. బుధవారం అర్ధరాత్రి దాటినతర్వాత హైదరాబాద్లోని ఖైరతాబాద్ చౌరస్తాలో సుజిత్పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా దాడిచేశారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుజిత్ను సమీపంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.