ములుగు : పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి ములుగు పోక్సో ( POCSO Case ) ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. నేరం రుజువైనందున 20 సంవత్సరాల పాటు కఠిన కారాగార జైలు శిక్ష ( Imprisonment ) ను విధించింది. 2023లో ములుగు ( Mulugu ) జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన కన్నెబోయిన సమ్మయ్య అనే వ్యక్తి మహిళపై దురుసుగా ప్రవర్తించడంతో ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
గురువారం పోక్సో ప్రత్యేక న్యాయస్థానంలో జరిగిన విచారణలో నిందితుడు దోషిగా తేలినందున అతడికి 20 సంవత్సరాలు కారాగార శిక్షతోపాటు రూ.20 వేల జరిమానా విధించారు. బాధితురాలికి రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని తీర్పునిచ్చారు. కేసును దర్యాప్తు చేసిన అధికారులను, కోర్టు లైజనింగ్ అధికారులను జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ అభినందించారు.