మరోమారు సర్కారు స్వచ్ఛ సంకల్పం
పల్లె, పట్టణ ప్రగతి, హరితహారానికి ఏర్పాట్లు ముమ్మరం
నేటి నుంచి 10వరకు ఉద్యమంలా కార్యక్రమాలు
మంత్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు
జిల్లాల వారీగా ప్రణాళికలు ఖరారు
ఏండ్లనాటి దారిద్య్రాన్ని తరిమికొడుతున్న ‘పల్లె ప్రగతి’
మెజార్టీ గ్రామాలకు కొత్త రూపు.. పరిశుభ్రత, పచ్చదనంతో కళకళ
మరోసారి పక్కాగా అమలుకు సర్కారు కార్యాచరణ
వరంగల్, జూన్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పల్లెలకు పట్టిన ఏండ్లనాటి దారిద్య్రాన్ని పోగొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘పల్లె ప్రగతి’ని అమలు చేస్తున్నది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఏ గ్రామం చూసినా పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడుతున్నది. అద్దాల్లాంటి రోడ్లు, ఎప్పుటికప్పుడు పారిశుధ్య నిర్వహణ, మంచి వాతావరణం పంచేందుకు పచ్చని చెట్లు, కాసేపు సేదతీరేందుకు ప్రకృతివనాలు, చివరి గమ్యానికి ప్రశాంతంగా చేరుకునేందుకు సిద్ధమైన వైకుంఠధామాలతో ప్రతి పల్లె కొత్తగా కనిపిస్తున్నది. కానీ, కొన్ని గ్రామాలు, పట్టణాలు లక్ష్యానికి దూరంగా ఉన్నాయని గుర్తించిన సర్కారు, మరోసారి పల్లె, పట్టణ ప్రగతిని, హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు జూలై1 నుంచి 10వరకు కార్యాచరణను సిద్ధం చేసింది.
పల్లెలు, పట్టణాల సమగ్ర వికాసమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రూపొందించిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మరోమారు పకడ్బందీగా అమలు చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. పల్లె, పట్టణ ప్రగతితోపాటు హరితహారాన్ని కలిపి జూలై 1 నుంచి 10 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన మేరకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిసి అన్ని జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. అధికారయంత్రాంగం పూర్తిస్థాయిలో ఈ కార్యక్రమంలో నిగమ్నమయ్యే లా ఈ సమావేశాలు కొనసాగాయి. ప్రజల అవసరాలే ప్రాతిపదికగా గుర్తించి ప్రజాప్రతినిధులు, అధికారులు పని చేయాలని సీఎం కేసీఆర్ ఇటీవల జరిగిన సమావేశంలో మంత్రులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీపీవోలను ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యాలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏమిటనే అంశాలపై సన్నాహక సమావేశాల్లో చర్చించారు. పది రోజులపాటు నిర్వహించే పల్లె, పట్టణ ప్రగతి అమలు తర్వాత గ్రామాలు, పట్టణాల్లో ఈ కార్యక్రమంలో నిర్దేశించిన ఏ పని కూడా పెండింగ్లో ఉండవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు అనుగుణంగా గ్రామ స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాలను ప్రత్యేకాధికారులు పర్యవేక్షించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేలా జిల్లా స్థాయిలో కార్యాచరణ సిద్ధం చేశారు. కార్యక్రమం అమలులో ఉమ్మడి జిల్లా ముందుండాలనే లక్ష్యంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు పోతున్నారు. గ్రామాల వారీగా పెండింగ్లో ఉన్న పనులు, పూర్తయిన పనులపై నివేదికలు రూపొందిస్తున్నారు. వీటిపై చర్చించి జూలై 1 నుంచి నిర్వహించే కార్యక్రమంలో పెండింగ్ పనులన్నీ పూర్తి చేసే దిశగా సాగుతున్నారు. పల్లె, పట్టణ ప్రగతి నిర్వహణపై పది రోజుల కార్యాచరణ ప్రణాళికను కలెక్టర్లు జారీ చేశారు. ఈ మేరకు ప్రతి గ్రామం, పట్టణంలో అమలు చేయాలని ఆదేశించారు.
పల్లె ప్రగతితో కొత్త రూపు..
పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘పల్లె ప్రగతి’ని అమలు చేస్తున్నది. 2019 సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 5 వరకు మొదటి విడుత, 2020 జనవరి 2 నుంచి 12 వరకు రెండో విడుత, ఈ ఏడాది జనవరిలో మూడో విడుత పూర్తయ్యింది. గతేడాది ఫిబ్రవరిలో పట్టణ ప్రగతి మొదలైంది. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పల్లె ప్రగతి ఎక్కువ గ్రామాల్లో విజయవంతమైంది. దీంతో పట్టణాలకు దీటుగా గ్రామాల్లో ఆరోగ్య ప్రమాణాలు పెరుగుతున్నాయి. వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కలిపి 1,687 పంచాయతీలున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు తొమ్మిది మున్సిపాలిటీలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా పల్లె ప్రగతి కోసం రూ.42.05 కోట్లు, పట్టణ ప్రగతి కోసం రూ.10.15 కోట్లు ఇస్తున్నది. నిధులు వెంట వెంటనే విడుదలవుతుండడంతో అన్ని పనులూ పూర్తవుతున్నాయి. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో బాగా అవసరం ఉండే వాటిని చేపడుతున్నారు. వైకుంఠధామం, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు ఏర్పాటవుతున్నాయి. అన్ని ఊర్లలోనూ వేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా గ్రామాల్లో ఇవి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. పారిశుధ్య నిర్వహణతో పల్లెలు ఇప్పుడు సురక్షితమైన ప్రాంతాలుగా మారాయి. నిండైన పచ్చదనంతో ఊర్లన్నీ స్వచ్ఛంగా మారుతున్నాయి. పారిశుధ్యం, పచ్చదనం పెంపు ప్రక్రియలో బాగా అవసరమయ్యే ట్రాక్టర్ను ప్రభుత్వం ప్రతి పంచాయతీకి అందించింది. వీటితో గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సులభతరమైంది. మొక్కలకు నీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగుతున్నది. పల్లె ప్రకృతి వనాలు ఊర్లకు కొత్తకళ తెచ్చాయి.
పల్లె ప్రగతితో కొత్త రూపు..
పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘పల్లె ప్రగతి’ని అమలు చేస్తున్నది. 2019 సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 5 వరకు మొదటి విడుత, 2020 జనవరి 2 నుంచి 12 వరకు రెండో విడుత, ఈ ఏడాది జనవరిలో మూడో విడుత పూర్తయ్యింది. గతేడాది ఫిబ్రవరిలో పట్టణ ప్రగతి మొదలైంది. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పల్లె ప్రగతి ఎక్కువ గ్రామాల్లో విజయవంతమైంది. దీంతో పట్టణాలకు దీటుగా గ్రామాల్లో ఆరోగ్య ప్రమాణాలు పెరుగుతున్నాయి. వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కలిపి 1,687 పంచాయతీలున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు తొమ్మిది మున్సిపాలిటీలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా పల్లె ప్రగతి కోసం రూ.42.05 కోట్లు, పట్టణ ప్రగతి కోసం రూ.10.15 కోట్లు ఇస్తున్నది. నిధులు వెంట వెంటనే విడుదలవుతుండడంతో అన్ని పనులూ పూర్తవుతున్నాయి. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో బాగా అవసరం ఉండే వాటిని చేపడుతున్నారు. వైకుంఠధామం, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు ఏర్పాటవుతున్నాయి. అన్ని ఊర్లలోనూ వేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా గ్రామాల్లో ఇవి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. పారిశుధ్య నిర్వహణతో పల్లెలు ఇప్పుడు సురక్షితమైన ప్రాంతాలుగా మారాయి. నిండైన పచ్చదనంతో ఊర్లన్నీ స్వచ్ఛంగా మారుతున్నాయి. పారిశుధ్యం, పచ్చదనం పెంపు ప్రక్రియలో బాగా అవసరమయ్యే ట్రాక్టర్ను ప్రభుత్వం ప్రతి పంచాయతీకి అందించింది. వీటితో గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సులభతరమైంది. మొక్కలకు నీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగుతున్నది. పల్లె ప్రకృతి వనాలు ఊర్లకు కొత్తకళ తెచ్చాయి.