బల్దియా అదనపు కమిషనర్ నాగేశ్వర్
గ్రీవెన్స్లో నగరవాసుల నుంచి వినతుల స్వీకరణ
వరంగల్, ఆగస్టు 30 : గ్రీవెన్స్ వినతులపై వెంటనే స్పందించాలని అదనపు కమిషనర్ నాగేశ్వర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కార్పొరేషన్ కౌ న్సిల్ హాల్లో నిర్వహించిన గ్రీవెన్స్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రీవెన్స్ వినతుల పరిష్కారంపై వింగ్ అధికారులు దృష్టి సారించాలన్నారు. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న వినతులను వెంటనే పరిష్కరించాలన్నారు.
మౌలిక వసతులు కల్పించాలి..
కాలనీల్లో కనీస వసతులు కల్పించాలని కోరుతూ ప్రజలు వినతులు అందజేశారు. గ్రీవెన్స్లో వివిధ కాలనీ ప్రజ లు తాము ఎదుర్కొంటున్న సమస్యల ను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కొత్తవాడలో కాల్వలను ఆక్రమించి ని ర్మాణాలు చేపట్టడంతో 100 ఫీట్ల రోడ్డుపైకి మురుగు నీరు వస్తోందని బ్యాంక్ కాలనీకి చెందిన చక్రపాణి అధికారులకు ఫిర్యాదు చేశారు. 2-9-976 ఇంటి నంబర్లో నల్లా లేకున్నా పన్ను వస్తోందని ఎన్జీవోస్ కాలనీకి చెందిన వజీద్ అలీ వినతిపత్రం అందజేశారు. 4వ డివిజన్ పరిధిలోని లోటస్ కాలనీలో రోడ్లు, డైనేజీ వ్యవస్థ లేదని, దీంతో ఇళ్లలోకి వ రద నీరు వస్తోందని కాలనీ అభివృద్ధి క మిటీ అధ్యక్షుడు మిరిపురి మల్లేశం అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కుమార్పల్లిలోని ఇంటి నంబర్ 4-7-37ను రద్దు చేయాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా స్పందించడం లే దని సురేశ్ ఫిర్యాదు చేశారు. పద్మాక్షి రో డ్ రాజ్పుత్ వాడలో నూతనంగా నిర్మించిన డ్రైనేజీపై డబ్బా వేశారని, దీంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని, వెంటనే చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్రావు వినతిపత్రం అందజేశారు.
64వ డివిజన్ మడికొండలోని 30-2-1287 నంబర్ గల ఇంటిని అనుమతులు లేకుండా నిర్మించారని, చర్యలు తీసుకోవాలని వినయ్, హరీశ్, వినీత్, ప్రవీణ్, నవీన్ ఫిర్యాదు చేశారు. ఎన్జీవోస్ కాలనీ రోడ్ నంబర్ -8లోని 2-9-976 నంబర్ గల ఇల్లు 103 గజాల స్థలంలో నిర్మించామని, మున్సిపల్ వెబ్సైట్లో మాత్రం 250 గజాలుగా నమోదయిందని, సవరించాలని వజీద్ అలీ అధికారులకు విన్నవించారు. వికాస్నగర్ రోడ్ నంబర్ -8లో అక్రమ నిర్మాణం చేపట్టారని, చర్యలు తీసుకోవాలని గూడూరు నరేందర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా, గ్రీవెన్స్లో మొత్తం 16 వినతులు రాగా, అందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి -5, ఇంజినీరింగ్ విభాగానికి -9, ప్రజారోగ్య విభాగానికి -2 వినతులు వచ్చాయి. గ్రీవెన్స్లో ఈఈ రాజయ్య, డీఈ, ఏసీపీ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.