హనుమకొండ, సెప్టెంబర్ 7 : రక్తదానం ప్రాణ దానంతో సమానమని కలెక్టర్ రాజీవ్గాంధీహన్మంతు పేర్కొన్నారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లో డీఆర్డీవో, రెడ్క్రాస్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హా జరయ్యారు. డీఆర్డీవో శ్రీనివాస్ కుమార్ రక్తదానం చేశా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రక్తదానంపై ప్రజలు అవగాహన పెంచుకొని స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తం అవసరం ఉన్న వారికి తక్కువ ధరకు అందించాలని రెడ్క్రాస్ ప్రతినిధులను కలెక్టర్ కోరారు. రక్తదాన శిబిరంలో 106 మంది రక్తం దానం చేశారు. శిబిరం లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీపీవో జగదీశ్వర్, రెడ్క్రాస్ సంస్థ చైర్మన్ విజయ్చందర్రెడ్డి, రాష్ట్ర ఎంసీ మెంబర్ శ్రీనివాసరావు, టీజీవోల సంఘం అధ్యక్షు డు జగన్మోహన్రావు, టీఎన్జీవో అధ్యక్షుడు ఆకుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
హసన్పర్తి : మండలంలోని సిద్ధాపూర్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (రెడ్ క్రాస్ సంస్థ) సౌజన్యంతో సర్పంచ్ జనగాం ధనలక్ష్మి ఆధ్వర్యంలో రక్తదాన శిబి రం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీఆర్డీవో శ్రీనివాస్కుమార్ హాజరయ్యారు. గ్రామంలోని 30 మంది యువకులు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణ, జనగాం కిరణ్, ఏపీడీ శ్రీవాణి, కార్యదర్శి మాలతి పాల్గొన్నారు.
ధర్మసాగర్ : రక్తదానం మరొకరికి ప్రాణదానమని సీఐ బొల్లం రమేశ్కుమార్ యాదవ్ అన్నారు. హన్మకొండలో పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆటోడ్రైవర్లు, పలువురు యువకులు స్వ చ్ఛందంగా ముందుకువచ్చి రక్తదానం చేశారు. పోలీసు స్టేషన్లో వారికి సీఐ సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. తెలంగాణ ఆటోడ్రైవర్స్ యూనియన్ మండలా ధ్యక్షుడు నక్క సురేశ్, వినోద్ పాల్గొన్నారు.
యువత రక్తదానం చేయాలి..
తలసేమియా వ్యాధిగ్రస్తులకు యువత రక్తదానం చేయడానికి స్వచ్చందంగా ముందుకు రావాలని సీపీ తరుణ్జోషి పిలునిచ్చారు. వరంగల్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ ఆధ్వర్యంలో మంగళవారం బీమారంలోని శుభం కల్యాణ వేదికలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా సీపీ మాట్లాడుతూ.. రక్తదానంపై యువత అపోహలను వీడి తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదానం చేయాలన్నారు. రక్తదానం చేసిన వారికి సీపీ సర్టిఫికెట్లు, పండ్లు అందజేశారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప, ఏసీపీ జితేందర్రెడ్డి, రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ విజయ్చందర్రెడ్డి, ఈవీ శ్రీనివాస్, సీఐలు జనార్దన్, రాఘవేందర్, రవికుమార్, ఎస్సైలు పాల్గొన్నారు.
ఎల్కతుర్తి : వరంగల్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎల్కతుర్తి మండల యువకులను సీపీ తరుణ్జోషి అభినందించారు. యువతను సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్న ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్, ఎస్సై గడ్డం ఉమకు సీపీ అభినందనలు తెలిపారు. రక్తదానం చేసిన వారిలో నాస్తిక్ రాకేశ్, గొర్రె శ్రీను, సాయిని సాయి కుమార్, ఎర్రబెల్లి వినయ్, సాయి, లక్ష్మణ్, శ్రీకాంత్ ఉన్నారు.