కాజీపేట, ఆగస్టు 26 : మదర్ థెరిస్సా చూపించిన మార్గంలో మనందరం నడువాలని వరంగల్ మేత్రాసనం పీఠాధిపతి బిషప్ డాక్టర్ ఉడుముల బాల పిలుపునిచ్చారు. కాజీపేట ఫాతిమానగర్ జంక్షన్లో గురువారం మదర్ థెరిసా జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మదర్థెరిసా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అనే స్ఫూర్తితో ఎం దరో అభాగ్యులకు సేవలందించారని కొనియాడారు. కార్యక్రమంలో కార్పొటర్ ఎలకంటి రాములు, ఫాతిమా కెథిడ్రల్ చర్చి ఫాదర్ కాసు మర్రెడ్డి, థెరిసా విగ్రహ పరిరక్షణ కమిటీ కన్వీనర్ రాజామోహన్ రావు, చర్చి అధ్యక్షుడు మథ్యాస్రెడ్డి, రాయప్ప, ప్రతాప్, దయాసాగర్, ప్రతాప్కుమార్ పాల్గొన్నారు.
పరకాలలో..
మదర్ థెరిసా జయంతిని పురస్కరించుకుని పరకాల ఒకటో వా ర్డులోని బేతేలు ఆశ్రమంలో ఆమె చిత్రపటానికి టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మడికొండ శ్రీను పూలమాల వేసి, నివాళులర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మడికొండ సంపత్కుమార్, సీఎస్ఐ మిషనరీ ఇన్చార్జి ప్రత్యూష్బాబు, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మేరుగు శ్రీశైలం, కందుకూరి విద్యాసాగర్, బొచ్చు జెమిని, మడికొండ ప్రవీణ్, మరుపట్ల మహేశ్, పెద్ది వెంకన్న, మడికొండ మొగిలి పాల్గొన్నారు.
కమలాపూర్లో..
మిత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పీహెచ్సీ ఆవరణలో మదర్ థెరిసా జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కట్కూరి విజయా తిరుపతిరెడ్డి, డాక్టర్ హర్షిణీప్రియ, టీఆర్ఎస్ నాయకుడు తక్కళ్లపల్లి సత్యనారాయణరావు, మిత్ర యూత్ సభ్యులు మధు, శ్రీధర్, నాగరాజు, శ్రీకాంత్, అనిల్, అరుణ్, రాజేశ్, రాజేందర్, శ్రీకాంత్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
హనుమాన్నగర్ ఫేజ్-1 కాలనీలో..
మదర్ థెరిసా జయంతిని ఐదో డివిజన్లోని హనుమాన్నగర్ ఫేజ్-1 కాలనీలో నిర్వహించారు. ఈ సందర్భంగా మదర్థెరిసా చిత్రపటానికి టీఆర్ఎస్ ఒకటో డివిజన్ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మొట్ల మనోహర్, చల్లా కుమార్రెడ్డి, రాజ్కుమార్, వెంకటేశ్, వీరగంటి శ్రావణ్, ఉదయ్కిరణ్, రమేశ్, వేణు పాల్గొన్నారు.
కరుణాపురంలో..
సినర్జియా గ్రూప్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ బ్రదర్ జాన్ ఆధ్వర్యంలో మండలంలోని కరుణాపురంలో మదర్ థెరిసా జయంతిని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటం వద్ద కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్ఎస్సై నద్దునూరి దాసు, లక్ష్మణ్, రాజేశ్, సుమన్, జ్యోతి, రజిత, సుజాత, సుమాంజలి, దినేశ్, విక్రమ్, కిరణ్ పాల్గొన్నారు.