మడికొండ, ఆగస్టు 24 : భూ కబ్జాలకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. మడికొండ పోలీస్ స్టేషన్ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ ప్రాంగణంలో మొక్క నాటి, నీళ్లు పోశారు. అనంతరం ఠాణా పరిసరాలను పరిశీలించారు. అంతకుముందు ఏసీపీని 64వ డివిజన్ కార్పొరేటర్ ఆవాల రాధికారెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి, మొక్కను అందజేశారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్సైలు నర్సింహారావు, సర్వర్, ట్రైనీఎస్సై హరిప్రియ సిబ్బంది పాల్గొన్నారు.
కాజీపేటలో..
కాజీపేట : కాజీపేటలోని సెయింట్ గ్యాబ్రియల్ హై స్కూల్ మైదానంలో ట్రాఫిక్ పోలీసులు హరితహారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ట్రాఫిక్ ఏసీపీ బాలస్వామి హాజరై మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అరుణ్ప్రకాశ్, ట్రాఫిక్ సీఐ ప్రభాకర్రెడ్డి, ఎస్సైలు సమ్మయ్య, హమీద్ పాల్గొన్నారు.
పర్యావరణాన్ని కాపాడాలి
ఆత్మకూరు : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, పర్యావరణాన్ని కాపాడాలని సీఐ రంజిత్కుమార్ కోరారు. మంగళవారం ఆత్మకూరు పోలీస్స్టేషన్ పరిధిలోని దుర్గంపేట నుంచి సీతారాంపురం వరకు ప్రధాన రహదారిపై మొక్కలు నాటారు. ఈసందర్భంగా సీఐ మాట్లాడుతూ గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డుసభ్యులు పాల్గొన్నారు
ముస్తఫాపూర్లో..
భీమదేవరపల్లి : ములుకనూరు ఠాణా పరిధిలోని ముస్తఫాపూర్లో మంగళవారం పోలీసులు హరితహారం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో 500 మొక్కల వరకు నాటారు. కార్యక్రమంలో ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్, సర్పంచ్ రొంటాల ప్రభాకర్, ఎంపీటీసీ మాడుగుల ఎజ్రా, ములుకనూరు ఎస్సై చంద్రమోహన్, ఏఎస్సై రాజిరెడ్డి పాల్గొన్నారు.
పంథినిలో..
ఐనవోలు : మండలంలోని పంథినిలో హరితహారంలో భాగంగా సర్పంచ్ కర్మిళ్ల ప్రేమలతా పూర్ణచందర్రావు, ఎంపీటీసీ బోయినపల్లి సోమేశ్వర్రావుతో కలిసి ట్రైనీ ఎస్సై మహేందర్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది సత్యనారాయణ, రమేశ్, గ్రామస్తుడు కన్నయ్య పాల్గొన్నారు.
మొక్కలను సంరక్షించాలి
న్యూశాయంపేట : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సుబేదారి ఎస్సై రాజు అన్నారు. న్యూశాయంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేటర్ మామిండ్ల రాజుతో కలిసి ఆయన మొక్కలు నాటారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.