వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఒకప్పుడు మరమగ్గాల పరిశ్రమకు శాయంపేట పెట్టింది పేరు. సమైక్య పాలనలో నిర్వీర్యమై స్రాప్ కింద మరమగ్గాలను అమ్ముకుని ఇకడి యజమానులు వలసలు వెళ్లి కార్మికులుగా మారారు. స్వరాష్ట్రంలో ఈ పరిస్థితి మారిపోయింది. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరెల ఆర్డర్ ఇస్తూ ఉపాధి కల్పించి నేతన్నలకు అండగా నిలిచింది. ఈ క్రమంలో శాయంపేటకు ప్రస్తుతం 30 వేల మీటర్ల చీరెల ఆర్డర్ రావడంతో కార్మికులు మరమగ్గాలపై ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటికే కొన్నివేల మీటర్ల చీరెలను సిద్ధం చేశారు. మిగతావి ఆర్డర్ ప్రకారం ఇచ్చేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. దీంతో చేతినిండా పని ఉండి డబ్బు సమకూరుతుండడంతో మరమగ్గాల పరిశ్రమకు పూర్వవైభవం వస్తుందన్న నమ్మకం కార్మికుల్లో కలుగుతున్నది.
సిరిసిల్ల నుంచి ఆర్డర్
సిరిసిల్ల కార్మికులు పెద్దమొత్తంలో బతుకమ్మ చీరెలు ఉత్పత్తి చేస్తున్నారు. తమకు అవకాశం ఇవ్వాలని శాయంపేట కార్మికులు కోరగా 15 మంది యూనిట్గా బతుకమ్మ చీరెల తయారీకి ఒప్పందం కుదిరింది. దీంతో సిరిసిల్లకు చెందిన యజమాని ఇకడికి 30వేల మీటర్ల ఉత్పత్తికి ఆర్డర్ ఇచ్చారు. నెలరోజులుగా ఇక్కడి కార్మికులు బతుకమ్మ చీరెల తయారీలో నిమగ్నమయ్యారు. కొందరు సొంత మగ్గాలపై తయారు చేస్తుండగా మరికొందరు కిరాయి తీసుకొని ఉపాధి పొందుతున్నారు. సాధారణ చీర్లైతే మీటర్కు రూ.8, డిజైన్ చీరె మీటర్కు రూ.12 చెల్లిస్తున్నారు. మరమగ్గాలపై రోజుకు ఒక సాంచా మీద 25 నుంచి 30 మీటర్ల చీరెలు తయారు చేస్తున్నారు. నాలుగు సాంచాలు ఉన్న వారు రోజుకు 100 మీటర్లకు పైగా తయారు చేస్తున్నారు. అంటే రోజుకు సుమారు వెయ్యి రూపాయలు, నెలకు రూ.25వేల నుంచి రూ.30వేల వరకు సంపాదిస్తున్నారు.
సిరిసిల్ల నుంచి వచ్చిన
బతుకమ్మ చీరెల ఆర్డర్ను సిరిసిల్ల సేటు నుంచి తీసుకున్నా. రెండు నెలల నుంచి తయారు చేస్తున్నా. గతంలో పదిహేనేళ్ల పాటు సొంతంగా సాంచాలు నడిపిన. ఇకడ పెట్టుబడి ఇచ్చేవారు లేక కరంటు కోతలతో వాటిని అమ్ముకుని సిరిసిల్లకు పోయిన. అక్కడ 20 ఏళ్లు సాంచాలు నడిపిన. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరెల ఆర్డర్ ఇస్తుండడంతో సొంత ఊరిలోనే పనిచేసుకోవచ్చని రెండేళ్ల కింద శాయంపేటకు వచ్చిన. ఎనిమిది సాంచాలు కిరాయి తీసుకున్నా. ఆర్డర్ మీద చీరెలు తయారు చేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది.
-మహమ్మద్ అంకుషావలీ, శాయంపేట
పరిశ్రమకు పూర్వవైభవం
మరమగ్గాల పరిశ్రమకు శాయంపేట ఎంతో ప్రసిద్ధి. కొన్నేళ్ల క్రితం వరకు శాయంపేటలో సుమారు 500మరమగ్గాలు నడిచేవి. వందల కుటుంబాలకు ఉపాధి లభించేది. సమైక్య పాలనలో ప్రోత్సాహం లేక యజమానులు మగ్గాలను స్రాప్ కింద అమ్ముకున్నారు. చాలామంది సిరిసిల్ల, భీవండికి వెళ్లి కార్మికులుగా పనిచేస్తూ వస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్నల ఉపాధి కోసం బతుకమ్మ చీరెల తయారీ ఆర్డర్ ఇస్తుండడంతో శాయంపేటలో మరమగ్గాలకు పూర్వవైభవం వస్తుందని ఆశిస్తున్నారు. శాయంపేటలో మరమగ్గాల పరిశ్రమ దెబ్బతినేందుకు కరంటు కోతలు కూడా కారణం కాగా, నేడు 24గంటలు సరఫరా అవుతుండడంతో పరిశ్రమకు ఎంతో ఉపశమనం లభించింది. ఈ క్రమంలో వలస వెళ్లిన వారు సైతం తిరిగి వచ్చి బతుకమ్మ చీరెలను తయారు చేస్తూ లబ్ధి పొందుతున్నారు. ఇవే కాకుండా సూల్ యూనిఫామ్స్, ఇతర వస్ర్తాలను ఉత్పత్తి చేస్తూ ఉపాధి పొందుతున్నారు. సిరిసిల్ల మాదిరిగా శాయంపేటకు సైతం నేరుగా చీరెల ఆర్డర్ ఇవ్వాలని నేతన్నలు కోరుతున్నారు.