రాయపర్తి, ఆగస్టు 9 : దళితులు, గిరిజనుల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని సర్పంచ్లు గారె నర్సయ్య, రెంటాల గోవర్దన్రెడ్డి, లేతాకుల సుమతి, కర్ర సరిత అన్నారు. మండలంలోని 39 గ్రామ పంచాయతీల పరిధిలోని కాలనీల్లో నెలకొన్న సమస్యల గుర్తింపు, చేపట్టాల్సిన పనులపై క్షేత్రస్థాయిలో పర్యటించారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు గూడెల్లి శ్రీలత శ్రీనివాస్, చిన్నాల తారాశ్రీ రాజబాబు, కందికట్ల స్వామి, కోదాటి దయాకర్రావు, హరినాథ్, నలమాస సారయ్య, భాస్కర్, అనంత ప్రసాద్, బోనగిరి ఎల్లయ్య, ఆలకుంట్ల రాజేందర్, చిలుముల్ల ఎల్ల మ్మ, రజనీ, గుగులోతు సుందర్నాయక్, భూక్యా వెంకట్రాంనాయక్, గుగులోత్ అశోక్నాయక్, మహేందర్నాయక్, మహ్మద్ శంషొద్దీన్, శాంతిరాజు, లక్ష్మి, కరుణశ్రీ, మమత, తదితరులు పాల్గొన్నారు.
ప్రణాళికలు సిద్ధం చేయాలి : ఎంపీపీ
వర్ధన్నపేట: గ్రామాల్లోని ఎస్సీ కాలనీలు, గిరిజన తండాల్లోని సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు తయారు చేయాలని ఎంపీపీ అన్నమనేని అప్పారావు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. ఎంపీడీవో రాజ్యలక్ష్మి అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల వారీగా పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్, ఎంపీటీసీలు, వార్డు సభ్యుల సహకారంతో సమస్యలను గుర్తించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు పాల్గొన్నారు.
శాయంపేటలో..
శాయంపేట: మండల పరిధిలోని పలు గ్రామాల దళిత వాడల్లో నెలకొన్న సమస్యలపై అధికారులు సర్వే ప్రారంభించారు. సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్, మిషన్భగీరథ, వాటర్ పైపులైన్ లీకేజీలు, విద్యుత్ సమస్యలపై పలు శాఖల అధికారులు సర్వే చేపట్టారు. కొత్తగట్టు సింగారంలో ఎంపీడీవో అమంచ కృష్ణమూర్తి సర్వేను పరిశీలించారు. నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిపారు.
దళితవాడల రూపురేఖలు మారాలి : ఎంపీడీవో
ఖానాపురం: రానున్న రోజుల్లో దళిత వాడల రూపురేఖలు మారాలని ఎంపీడీవో సుమనవాణి అన్నారు. మండలంలోని రాగంపేట, కొత్తూరు గ్రామాల్లో దళిత వాడలను, భద్రుతండాలో శ్మశానవాటిక నిర్మాణ పనులను సోమవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. రాగంపేట, కొత్తూరు గ్రామాల్లో సీసీ రోడ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆమె వెంట సర్పంచ్లు బూస రమ అశోక్, గుగులోత్ పద్మ, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.