కమలాపూర్, ఆగస్టు 26 : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రవేశపెట్టిన పథకాలతో టీఆర్ఎస్ పార్టీకే ప్రజల మద్దతు ఉందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని అంబాల, గూడూరు గ్రామాల్లో గురువారం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టిందన్నారు. దీంతో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఆర్థికంగా ఎదుగుతున్నట్లు చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వ చ్చినా టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలువడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నిక లో రూ.వేల కోట్లు ఉన్న ఈటల రాజేందర్పై పేదవాడైన గెల్లు శ్రీనివాస్ పోటీ చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ దళితుల సంక్షేమ కోసం దళితబంధు పథ కం ప్రవేశపెట్టినట్లు చెప్పారు. నియోజకవర్గంలోని ఒక్కో కుటుంబానికి రూ.పది లక్షలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్న ట్లు వెల్లడించారు. ఇప్పటికే రూ.1500 కోట్ల నిధులు జమ చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్కు అండగా నిలిచి, గెల్లు శ్రీనివాస్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్లు లింగమూర్తి, సాంబయ్య, ఎంపీటీసీలు వెంకటేశ్వర్లు, లక్ష్మి
కారు గుర్తుకే ఓటేసి గెలిపించాలి
రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికలో కారు గుర్తుకే ఓటేసి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. గురువారం మండలంలోని అంబాల, గూడూరు, వంగపల్లి, గోపాల్పూర్ తదితర గ్రామాల్లో ఇంటింటికీ ప్రచారం చేశారు. ప్రజల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. దళారుల బెడద లేకుండా ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు చేరుతున్నాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇక్కడ ఒక్క రూపాయి పని చేయలేదని ఆరోపించారు. అభివృద్ధి పనులను టీఆర్ఎస్ ప్రభుత్వమే చేస్తోందని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.