వరంగల్,అక్టోబర్ 26: ప్రజా సమస్యల పరిష్కారానికే డివిజన్ బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని నగర మేయర్ గుండు సుధా రాణి అన్నారు. మంగళవారం కమిషనర్ ప్రావీణ్యతో కలిసి ఆరు డివి జన్లలో ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. 1వ డివిజన్ పరిధిలోని ముచ్చర్ల గ్రామంలో శివాలయం వరకు రోడ్డు, ఎస్సీ కాలనీలోని, పెగ డపల్లి శ్మశాన వాటిక అభివృద్ధి, అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయా లని కార్పొరేటర్ అరుణ కుమారి మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. 2వ డివిజన్లోని వంగపహాడ్లో కుక్కల బెడద, డ్రైనేజీలు లేకపోవడంతో మురుగు నీరు రోడ్ల పైకి వస్తున్నదని కార్పొరేటర్ లావుడ్యా రవి, ప్రజలు మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. 3వ డివిజన్లో పైడిపల్లి బ స్టాండ్ ప్రాంతంలో బాక్స్ డ్రైనేజీ నిర్మాణం చేయాల ని, ఆరెపల్లి, కొత్తపేట గ్రామాల్లో రోడ్లకు మరమ్మ తులు చేపట్టాలని స్థానికులు కోరారు. మద్యగూడెం ఎస్సీ శ్మశాన వాటిక ప్రహరీ నిర్మించి, విద్యుత్ దీపా లు ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ జన్ను షీబా రాణి కోరారు. 4వ డివిజన్లో శ్మశాన వాటికలను అభివృద్ధి చేయాలని, కేయూసీ రోడ్డు వెంబడి ఉన్న విశాల్ స్కూల్ నుంచి ఆర్ఆర్ గార్డెన్ వరకు డ్రైనేజీ, లోటస్ కాలనీ, జ్యోతి బసుకాలనీ, కృష్ణానగర్ కాల నీలో రోడ్డు నిర్మించాలని కార్పొరేటర్ అశోక్ కోరా రు. 5వ డివిజన్లో అంతర్గత రోడ్లను నిర్మించాల ని, హనుమాన్నగర్ వంతెన వరకు, సింగారం రహ దారిలో డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని కార్పొరేటర్ శ్రీమన్నారాయణ కోరారు. 6వ డివిజన్లోని కుమ్మరివాడ నుంచి కిషన్పుర రోడ్డు కంకరతేలి ఉందని ప్రజలు మేయర్ దృష్టికి తీసుకువ చ్చారు. సాబీర్ హోటల్ నుంచి పోచమ్మకుంటకు వెళ్లే రహదారిని అభివృద్ధి చేయాలని, నయీంనగర్ నాలాలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని కార్పొరేటర్ మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్ర మంలో అదనపు కమిషనర్ నాగేశ్వర్, ఎస్ఈ సత్యనారాయణ, చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, సీహెచ్వో సునీత, సిటీ ప్లానర్ వెంకన్న, డిప్యూటీ కమిషనర్లు జోనా, రవీందర్, ఈఈ, డీఈ, ఏఈ, డీసీపీ, ఏసీపీ, తదితరులు పాల్గొన్నారు.
డివిజన్లలో మౌలిక వసతులు కల్పిస్తాం : గుండు సుధారాణి
అన్ని డివిజన్లలో మౌలిక వసతులు కల్పిస్తాం. రోడ్లు, డ్రైనేజీలతో పాటు శ్మశానవాటికలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తాం. గుర్తించిన సమస్యలను ప్రాధాన్యతా ప్రకారం పరిష్కరిస్తాం.