పోచమ్మమైదాన్, సెప్టెంబర్ 19 : జిల్లా వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. వరంగల్ 12వ డివిజన్లోని తుమ్మలకుంట బాలాజీనగర్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. తుమ్మలకుంట బాలాజీ సంఘం ఏరియాలో 18 సంవత్సరాలు దాటిన వారు 1076 మంది ఉండగా, స్థానిక కార్పొరేటర్ కావటి కవిత ఆధ్వర్యంలో అందరూ వ్యాక్సిన్ వేసుకున్నారు. కాగా, ఆదివారం ఇక్కడి వ్యాక్సినేషన్ కేంద్రాన్ని గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య సందర్శించారు. వందశాతం పూర్తి చేసి సందర్భంగా కమిషనర్ తుమ్మలకుంట అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మేరుగు సాంబయ్యకు ప్రశంసాపత్రం అందజేశారు.
చెన్నారావుపేట : మండలంలోని లింగాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సర్పంచ్ తప్పెట రమేశ్ ప్రారంభించారు. పదహారుచింతల్తండాలో సర్పంచ్ శారదాగణేశ్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు శ్వేత, రాజకుమారి, సూపర్వైజర్ రామెల్, వార్డు సభ్యుడు అజ్మీరా శ్రీను, ఆశ కార్యకర్తలు సంధ్య, అరుణ, అన్నపూర్ణ, రమాదేవి, వనిత పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్ : అర్హులందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని జడ్పీటీసీ కోమాండ్ల జయ అన్నారు. ఆదివారం మండలంలోని కమ్మపల్లి, దాసరిపల్లి గ్రామాల్లో వైద్య సిబ్బందితో కలిసి ఇంటింటా తిరుగుతూ వ్యాక్సినేషన్పై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్లు వల్గుబెల్లి రంగారెడ్డి, శ్రీనివాస్, ఎంపీటీసీ వల్గుబెల్లి విజయ, కార్యదర్శులు, కారోబార్లు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నల్లబెల్లి: మండలంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. కార్యక్రమంలో వైద్యాధికారి మహేందర్నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.
ఖిలావరంగల్ : ఖిలావరంగల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తూర్పుకోట, మధ్యకోట, పడమర కోటతోపాటు పీహెచ్సీలో ప్రత్యేకంగా వ్యాక్సి న్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 40 వేల మందికి గాను 40 శాతం టీకాలు పూర్తి చేశారు. పడమర కోటలోని ఇనుముల వాడలో 100 శాతం టీకాలు పూర్తి చేయగా 38వ డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన ఉమ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యాధికారి దిలీప్కుమార్, సూపర్వైజర్ బషీర్, నోడల్ ఆఫీసర్ నరేంద్ర, కిశోర్, నాగరాజు, రవి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కరీమాబాద్ : వ్యాక్సిన్తోనే కరోనాను అరికట్టవచ్చని 39వ డివిజన్ కార్పొరేటర్ సిద్దం రాజు అన్నారు. డివిజన్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ను పరిశీలించారు.
రాయపర్తి : వ్యాక్సిన్ వేసుకోడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని హెల్త్ విజిటర్లు గండికోట లక్ష్మీకాంత మణి, ధరావత్ భీమానాయక్ కోరారు. మండలంలోని వ్యాక్సినేషన్ శిబిరాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు వస్కుల శారమ్మ, భూక్యా ఝాన్సీ, పెండ్యాల అరుణ, సునీత, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
సంగెం : మండలంలోని తీగరాజుపల్లి గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి పొగాకుల అశోక్ పరిశీలించారు. 176 మందికి వ్యాక్సినేషన్ చేసినట్టు వైద్యసిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కర్జుగుత్త రమ, ఎంపీటీసీ రంగరాజు నర్సింహస్వామి గ్రామస్తులు పాల్గొన్నారు.