భీమారం, జూలై 31 : సామాజిక సేవారంగంలో విశిష్ట సేవలందించిన యువతకు కేంద్ర ప్రభుత్వ క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చే అత్యున్నత పురస్కారం జాతీయ ఉత్తమ యువజన అవార్డుకు కాకతీయ యూనివర్సిటీ ఆంగ్లవిభాగం పరిశోధక విద్యార్థి, సామాజిక కార్యకర్త మహ్మద్ ఆజమ్ 2017-18 సంవత్సరానికి ఎంపికయ్యారు. కేయూ వీసీ తాటికొండ రమేశ్, జాతీయ సేవా పథకం సమన్వయకర్త డాక్టర్ ఎస్ జ్యోతి, పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ మల్లారెడ్డి శనివారం ఆజమ్ను అభినందించారు. కరీంనగర్ జిల్లా మంకమ్మతోటకు చెందిన ఆజమ్ కేయూ ఆంగ్ల సాహిత్యంలో డాక్టర్ మేఘనరావు పర్యవేక్షణలో పరిశోధన చేస్తున్నారు. దీంతోపాటు రక్తదానం, అవయవదానం, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కల పెంపకం, హరితహారం, జలసంరక్షణ, ఇంకు డు గుంతల నిర్మాణం, స్వచ్ఛ భారత్, ప్లాస్టిక్ నిషేధం వంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులకు జీవన నైపుణ్యాలు, లాంగ్వేజ్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసం, బడిబాట వంటి అంశాలపై సదస్సులు నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో కలిగే ప్రయోజనాలపై గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సమాజాభివృద్ధికి పాటు పడుతున్నందున కేంద్రప్రభు త్వం జాతీయ ఉత్తమ యువజన అవార్డుకు ఎంపిక చేసింది. ఆగస్టు 12న అంతర్జాతీయ యువజన దినోత్సవం రోజు న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో అవార్డుతోపాటు రూ.50వేల నగదు బహుమతిని అం దుకోనున్నారు. ఆజమ్ను కేయూ రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్ మల్లికార్జునరెడ్డి, ఆంగ్ల విభాగ ప్రొఫెసర్లు పురుషోత్తం, రాజేశ్వర్, లత, దీప, జ్యోతి, మేఘనారావ్, నిర్మల అభినందించారు.