దుగ్గొండి, జనవరి 25 : మండలంలోని రోడ్లులేని గ్రామాలకు నిధులు మంజూరయ్యాయని, ఈ నిధులతో దుగ్గొం డి మండల ప్రజల కల సాకారం కానున్నదని వరంగల్ జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలో పలు గ్రామాలకు రూ. 4 కోట్ల 40 లక్షలతో నిర్మించనున్న రోడ్లకు నిధులు మంజూరు అవ డంతో ఆయా గ్రామాల ప్రజలు మండల ప్రజాప్రతినిధు లు, టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కే కోమల, టీఆర్ఎస్ మండలాద్యక్షుడు ఎస్ రాజేశ్వర్రావు, వైస్ ఎంపీపీ పల్లాటి జైపాల్రెడ్డి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ తోకల నర్సింహారెడ్డి, క్లస్టర్ ఇన్చార్జిలు సురేందర్రెడ్డి, కమలాకర్, సర్పంచ్లు, ఏ సుదాకర్, ఆర్ సురేందర్ రెడ్డి, బీ శ్రీనివాస్రెడ్డి, మమతామోహన్, జీ రాజిరెడ్డి, ఎస్ రాజన్న పాల్గొన్నారు.
నిధుల మంజూరుపై హర్షం..
నర్సంపేట రూరల్: మండలంలోని దాసరిపల్లి, కమ్మపల్లి గ్రామాల్లో మండల టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం సీఎం కేసీఆర్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి చిత్రపటాలకు టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాలాభిషేకం చేశారు. మండలంలోని కమ్మపల్లి నుంచి దుగ్గొండి మండలం తిమ్మంపేట వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.90 లక్షల నిధులు మంజూరు కావడంపై ప్రజలు హ ర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నామాల సత్యనారాయ ణ, మాజీ ఎంపీపీ నల్లా మనోహర్రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ మోతె జయపాల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మురాల మోహన్రెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహారాములు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు భూక్యా వీరన్నలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ సందర్భంగా సీఎం, ఎమ్మెల్యేల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వల్గుబెల్లి రంగారెడ్డి, ఎంపీటీసీ విజయ, టీఆర్ఎస్ మండల నాయకులు ఎం నర్సయ్యగౌడ్, కోమాండ్ల గోపాల్రెడ్డి, ఎం పద్మనాభారెడ్డి, వల్లాల కర్ణాకర్గౌడ్, బీ మాధవారెడ్డి, మిట్టగడుపుల మల్లయ్య, చిలువేరు యాకయ్య, మాధవారెడ్డి, చిరంజీవి, పీ కృష్ణ, రాజు, తిరుపతి, రవి, ఉపేంద్ర ఉన్నారు.
దాసరిపల్లిలో..
దాసరిపల్లి గ్రామ శివారు నుంచి చంద్రయ్యపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.60 లక్షల నిధులు మంజూరయ్యాయి. దీంతో టీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీ ప్రతాప్రెడ్డి, మేర్గు రవి, తుమ్మ నాగయ్య, శ్రీనివాస్రెడ్డి, పెం డ్యాల మునీందర్, కే రాజు, శ్రీనివాస్, డీ బుచ్చిరెడ్డి, ప్రతాప్రెడ్డి, చిలువేరు శ్రీనివాస్, అభిలాశ్, తిరుపతి, సుమన్, వార్డు సభ్యులు, నాయకులు తదితరులున్నారు.
అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
చెన్నారావుపేట: అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బీ వెంకన్నగౌడ్ పేర్కొన్నారు. ఎన్నో దశాబ్దాలుగా మండలంలోని జోజిపేటనారాయణతండా ప్రజలు నోచుకోని బీటీ రోడ్డును ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రూ. 60 లక్షల నిధులతో ఆర్ అండ్బీ రోడ్ నుంచి కిలోమీటర్ వరకు మంజూరు చేయించారు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే పెద్దికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మంగళవారం టీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకన్నగౌడ్ సర్పంచ్ ఏ విజయాబాలజోజి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీకోఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, సర్పంచ్ ఫోరంల మండలాధ్యక్షుడు కుండె మల్లయ్య, అమీనాబాద్ సొసైటీ చైర్మన్ మురహరి, సర్పంచ్లు ఏ కుమారస్వామి, జాటోత్ స్వామినాయక్, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, చెన్నారావుపేట టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కందకట్ల సాంబయ్య, వార్డు సభ్యు లు నాగోత్ జ్యోతి, ఎన్ దాసయ్య, కుమారస్వామి, గ్రామ అధ్యక్షుడు బానోత్ రమేశ్నాయక్, యూత్ అధ్యక్షుడు జయంత్, ఎల్ హరిలాల్, దేవేందర్, యాకూబ్, రవి, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
బీటీ రోడ్లు మంజూరుపై హర్షం..
నల్లబెల్లి: మండలంలోని పలు గ్రామాలకు ప్రభుత్వం బీటి రోడ్లు మంజూరు చేయడంపై మండల టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్వక్తం చేశారు. ఈ సందర్భంగా ఒల్లెనర్సయ్యపల్లె గ్రామంలో ఎంపీపీ ఊడుగుల సునీతాప్రవీణ్ పార్టీ శ్రేణులతో కలిసి మంగళవారం సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు తంగెళ్ల నిర్మలార వీందర్రెడ్డి, గోనె శ్రీదేవి, ఊరటి అమరేందర్, గందె శీనువాస్గుప్త, చిట్యాల సీతారాంరెడ్డి, మొహన్రెడ్డి, రవీందర్ పాల్గొన్నారు.