వరంగల్ : వరంగల్ పర్యటనకు వచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ను శాలువాతో మంత్రి సత్కరించారు.
కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి, కార్పొరేషన్ల చైర్మన్లు వాసుదేవ రెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు, జనగామ జిల్లా జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావు, మాజీ ఎంపీ సీతారాం నాయక్, టీఆర్ఎస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సతీష్ రెడ్డి, కేశవ రావు తదితరులు పాల్గొన్నారు.