కాజీపేట, జనవరి 29 : కేంద్ర ప్ర భుత్వం ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ, పీవోహెచ్ షెడ్డు నిర్మాణానికి రూ.400 కోట్లు కేటాయించాలని అఖిలపక్ష నాయకులు డిమాం డ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చే యాలని డిమాండ్ చేస్తూ చీఫ్ విప్ దా స్యం వినయ్భాస్కర్ అధ్యక్షతన శనివా రం కాజీపేటలో అఖిలపక్ష నాయకులు ధర్నా, రాస్తారోకో చేశారు. కాజీపేట రై ల్వే జంక్షన్ నుంచి చౌరస్తా వరకు ర్యా లీగా వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు రెం డు గంటల పాటు జరిగిన ధర్నాతో అ టు నిట్ వరకు, ఇటు మడికొండ వర కు వాహనాలు నిలిచిపోయాయి. సీఐ మహేందర్రెడ్డి ట్రాఫిక్ను క్లియర్ చే యించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ నాలుగున్నర దశాబ్దాల ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటయ్యే వరకూ ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు. కోచ్ ఫ్యాక్టరీ ఉద్యమం ఆరంభం మాత్రమేనని, బీజేపీ మెడలు వంచి కాజీపేట రైల్వే సమస్యలను పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు.
కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే వరకూ పోరాటం : చీఫ్ విప్
చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ కాజీపేట రైల్వే జంక్షన్కు మంజూరైన వ్యాగన్ ఫ్యాక్టరీ, పీవోహెచ్ షెడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 159.7 ఎకరాల భూమిని దాదాపు ఏడాది క్రితం రైల్వేశాఖకు అప్పగించిందని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ప నులు ప్రారంభించకుండా కావాలని కాలయాపన చేస్తున్నదని విమర్శించా రు. గతంలో కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ, పీవోహెచ్ షెడ్డు నిర్మాణానికి బడ్జెట్లో కేటాయించిన నిధులను మ రో ప్రాంతానికి తరలించిందని తెలిపా రు. కాజీపేట రైల్వే జంక్షన్ను నిర్వీర్యం చేసేందుకు ఇక్కడి క్రూ లింక్లను విజయవాడకు తరలించడంతో పాటు ప లు రైల్వే డిపోలను ఇతర ప్రాంతాలకు తరలించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. పునర్విభజ న చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రైల్వే కోచ్ ఫాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్ర మ, గిరిజన యూనివర్సిటీని వెంటనే ఏర్పాటు చేయాలని వినయ్భాస్కర్ డి మాండ్ చేశారు. తెలంగాణ బీజేపీ నా యకులు ఢిల్లీలో అధినాయకత్వంపై ఒ త్తిడి పెంచి అన్ని అర్హతలు ఉన్న కాజీపే ట రైల్వే జంక్షన్కు రైల్వే డివిజన్ హోదా కల్పించేందుకు కృషి చేయాలన్నారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించే వరకూ పోరా టం ఆగదని చీఫ్విప్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు కోసం పార్టీలకతీతంగా పోరాడిన స్ఫూర్తితోనే కోచ్ ఫ్యా క్టరీ కోసం ఉద్యమించి సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
విభజన హామీలు నెరవేర్చాలి..
తెలంగాణ ప్రాంత బీజేపీ ఎంపీలు కేం ద్ర ప్రభుత్వం పై ఒత్తిడి పెంచి విభజన హామీలు నెరవేర్చాలని, లేకుంటే పదవులకు రాజీనామాలు చేసి ప్రజల ఆకాంక్ష మేరకు ఉద్యమంలో పాల్గొనాలన్నారు. బడ్జెట్లో కాజీపేటకు సరైన న్యాయం జరుగకుంటే బీజేపీ నాయకులను తిరుగనివ్వమని హెచ్చరించారు. ఐదు రోజుల పాటు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో శాంతియుతంగా అఖిల పక్షం ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించినట్లు వివరించారు. సోమవారం సికింద్రాబాద్లో రైల్వే కార్యాలయం ఎదుట ధర్నా చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎలకంటి రాములు, సంకు నర్సింగరావు, జక్కుల రవీందర్యాదవ్, విజయశ్రీ, రజాలీ, టీఆర్ఎస్ నాయకులు అజీజ్ఖాన్, మర్రి యాదవరెడ్డి, నార్లగిరి రమేశ్, కాటాపురం రాజు, బస్వ యాదగిరి, సుంచు కృష్ణ, సోనీ, మర్యా ల కృష్ణ, శివకుమార్, సర్వర్, సిరిల్, జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, విజయ్, సీపీఎం నాయకుడు చుక్కయ్య, సీపీఐ నాయకులు ఉప్పలయ్య, వెంకటేశ్, న్యూడెమోక్రసీ నాయకుడు అప్పారావు, టీడీపీ రాష్ట్ర నాయకులు బాబాఖాదర్ అలీ, మహే శ్, ఎమ్మార్పీఎస్ నాయకులు పుట్ట రవి మాదిగ, బండారి సురేందర్ మాదిగ, రైల్వే మాజీ కార్మిక నాయకుడు యాదవరెడ్డి, నాగేశ్ పాల్గొన్నారు.