FSSAI | హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): దేశంలో విక్రయిస్తున్న ఆహార పదార్థాల్లో సగటున 25శాతం వరకు కల్తీ జరుగుతున్నట్టు గుర్తించామని భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) వెల్లడించింది. పాలు, వంట నూనెలు, మసాలాలు, టీ పొడి, పప్పులు, ఫోర్టిఫైడ్ రైస్ తదితర పదార్థాలకు సంబంధించి గత నాలుగేండ్లలో సేకరించి విశ్లేషించిన వివిధ ఆహార పదార్థాల నాణ్యతా ఫలితాలను ఎఫ్ఎస్ఎస్ఏఐ సోమవారం విడుదల చేసింది. నమూనాలను విశ్లేషించేందుకు 239ప్రయోగశాలలు, 261 మొబైల్ ల్యాబ్లు వినియోగించినట్టు తెలిపింది.