ప్రపంచ వారసత్వ జాబితాలోచోటుపై సంతోషంగా ఉంది
చారిత్రక కట్టడాల అభివృద్ధికి ఇంకా పనిచేయాల్సి ఉంది
కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు బీవీ పాపారావు
హన్మకొండ, జూలై 26: రామప్పకు ప్రపంచ వారస త్వ సంపద గుర్తింపు అనేది దశాబ్ద కాల సుదీర్ఘ ప్రయా ణం అని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు వీవీ పాపారావు అన్నారు. సోమవారం ఆయన హన్మకొండ హరిత కాకతీయ హోటల్లో ధర్మకర్త ప్రొఫెసర్ పాండు రంగారావు, ఆర్కిటెక్చర్ సూర్యనారాయణమూర్తితో కలి సి విలేకర్లతో మాట్లాడారు. రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా కట్టబెట్టడం చాలా సంతోషంగా ఉంద న్నారు. ఇందుకోసమే 2009లో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఏర్పాటైందని అన్నారు. ఈ గుర్తింపు అనేది ఒక మైలురా యి మాత్రమేనని, ప్రయాణం ముగింపు కాదని పేర్కొ న్నారు. కాకతీయ కట్టడాల అభివృద్ధికి ఇంకా పనిచేయా ల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వ సహాయంతో ట్రస్ట్ 2016లో నామినేషన్ ప్రచారాన్ని ప్రా రంభించిందని పాపారావు తెలిపారు.
ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ప్రధాని మోదీతో వ్యక్తిగతంగా మాట్లాడి కాకతీయ కట్టడాల ప్రాముఖ్యతను వివరిస్తూ అధికారికంగా లేఖను రాశారని పేర్కొన్నారు. దీంతో 2019లో యునెస్కోకు భారత్ నామిషన్ సమర్పించిందని అన్నారు. ట్రస్ట్ సూ ర్యనారాయణమూర్తిని ఆర్కిటెక్చర్గా నియమించి డౌసి యర్ను తయారుచేసిందన్నారు. ఆయన చాలా శ్రద్ధతో దాన్ని రూపొందించారని పాపారావు పేర్కొన్నారు. ప్రొఫె సర్ పాండు రంగారావు కాకతీయుల జియో టెక్నికల్ ఇంజినీరింగ్ గురించి తనకున్న అపారమైన పరిజ్ఞానంతో సాంకేతిక అంశాలను చేర్చారన్నారు. అలాగే చందామణి నందగోపాల్ ఆలయ కళాత్మక అంశాలను జోడించారని పేర్కొన్నారు. 2019 నవంబర్లో పారిస్లో సుమారు 30 మంది అంతర్జాతీయ నిపుణల సమక్షంలో నామినేష న్ సమర్థించడం చాలా కీలకమని అన్నారు. అప్పుడు తన తోపాటు పాండురంగారావు, సూర్యనారాయణమూర్తితో కూడిన కమిటీ ఐకోమాస్ను ఆకట్టుకునేందుకు చాలా కృషి చేశామన్నారు. రామప్ప ఆలయాన్ని ప్రపంచ వార సత్వ ప్రదేశంగా గుర్తించేందుకు ఐకోమాస్ ముందుగా కొన్ని సిఫారసులు చేసిందన్నారు. వీటిని తెలంగాణ ప్రభు త్వం, ములుగు జిల్లా కలెక్టర్, సాంస్కృతిక, పర్యాటక శాఖలు అమలు చేశాయని ఆయన పేర్కొన్నారు. పనులు పూర్తి చేసే వరకు నామినేషన్ వాయిదా వేయాలని ఐకో మాస్ సిఫారసు చేసినప్పటికీ, యునెస్కోలోని భారత రాయబారి విశాల్ శర్మ ఒక నెలలోనే మనకు అనుకూలం గా మార్చారన్నారు. కొత్త సాంస్కృతిక మంత్రి మీనాక్షి లేఖ, కిషన్రెడ్డి సహాయంతో విశాల్ దౌత్య ప్రచారం చేపట్టి ప్రపంచ వారసత్వ కమిటీలోని 21 మంది సభ్యులను ఒ ప్పించడంలో విజయం సాధించారన్నారు. దశాబ్దం పాటు కొనసాగిన ఈ ప్రయత్నం చివరిమైలును సమర్థవంతంగా కవర్ చేసినందుకు విశాల్శర్మకు ధన్యవాదాలు తెలిపారు. ఆలయం సరిహద్దులు మార్పులు చేయాలని ప్రపంచ వారసత్వ కమిటీ సూచించిందని, అలాగే రెండు చిన్న దేవాలయాలను చేర్చాలని సిఫారసు చేసిందని తెలిపారు.