అల్వాల్, ఏప్రిల్ 23 : మతిస్థిమితం సరిగా లేని ఓ మహిళ కన్న కూతురికి ఉరివేసి, తాను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అల్వాల్ ఎస్ఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒరిస్సా రాష్ట్రం మయూర్భంజ్ జిల్లా, బిజోయ్ రామచంద్రపురం గ్రామానికి చెందిన సుధేందు గిరి, బిష్ణు ప్రియ(32)భార్యాభర్తలు. బతుకుతెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి ఓల్డ్ అల్వాల్లోని భరత్నగర్లో నివాసముంటున్నారు. వీరికి హ్రితిక(మూడున్నర సంవత్సరాలు) కూతురు ఉంది. సుధేందు గిరి సిద్దిపేట జిల్లా కర్కపట్ల బయోటెక్ పార్క్లోని అస్పిరో ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే సుధేందు గిరి రోజుమాదిరిగానే గురువారం ఉదయం ఉద్యోగానికి వెళ్లాడు. విధులు ముగించుకుని రాత్రి 8.30గంటల సమయంలో ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే భా ర్య బిష్ణుప్రియ, కూతురు హ్రితిక బెడ్రూంలోని ప్యాన్కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించారు. దీంతో ఆందోళనకు గురైన సుధేందుగిరి వెంటనే అల్వాల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఎస్ఐ భాస్కర్ కేసు నమో దు చేసుకొని దర్యప్తు చేస్తున్నట్లు తెలిపారు.