కొడంగల్, మే 25 : రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను కొనసాగించాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కొనుగోలు కేంద్రాల నిర్వాహకు లు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవా రం కొడంగల్లో పర్యటించిన ఎమ్మెల్యే కొనుగోలు కేంద్రాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పండిన చివరి ప్రతి గింజను కొనుగోలు చేయాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యంగా పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, లారీల కొరత కొంత వరకు ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. గడచిన 4, 5 రోజుల్లో నియోజకవర్గానికి దాదాపు 4లక్షల గన్నీ బాగులు సరఫరా అయ్యాయని, మరో రెండు రోజుల్లో లక్షా50వేల గన్నీ బ్యాగులు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్మిల్లులకు తరలించేందుకు లారీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్పోర్ట్ అధికారులను ఆదేశించారు.
ధాన్యం సరఫరాకు ప్రత్యేకంగా 50 లారీలు అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైస్మిల్లుల యాజమాన్యంతో మాట్లాడి ధాన్యం నిలువలకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ధాన్యం నిలువలకు ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో కరోనా కొంతవరకు కట్టడి అవుతున్న ట్లు తెలిపారు. ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అం దించాలని, లాక్డౌన్ నిబంధనలు విధిగా పాటించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కొడంగల్, బొంరాస్పేట ఏపీసీఎస్ అధ్యక్షుడు కటకం శివకుమార్, విష్ణువర్ధన్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భీములు, మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్యాదవ్, బొంరాస్పేట వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, దౌల్తాబాద్ జడ్పీటీసీ కోట్ల మహిపాల్, నాయకులు టీటీ రాములు, మహేందర్రెడ్డి, దామోదర్రెడ్డి, మడిగె శ్రీను పాల్గొన్నారు.