వికారాబాద్, జూన్ 21 :వికారాబాద్లో శివసాగర్ చెరువును మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం వికారాబాద్, పరిగి, తాండూరు , పరిగి ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్తో కలిసి వికారాబాద్ మున్సిపల్ పరిధిలో ఉన్న శివసాగర్ చెరువును పరిశీలించారు. మినీ ట్యాంక్ బండ్గా నిర్మాణం చేసేందుకు అధికా రులకు సలహాలు, సూచనలు చేశారు. నూతన కలెక్టరేట్ వద్ద రెండు హెలీకాఫ్టర్లు నిలిపేందుకు అనువైన స్థలం సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చెరువు సమీపంలో ఉన్న ప్రైవేటు భూమిని వదిలి ప్రభుత్వ భూమిలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. భారీ వర్షాలు కురిస్తే మినీ ట్యాంక్ బండ్కు ఇబ్బందులు కలుగకుండా పకడ్భందీగా నిర్మా ణాలు చేపట్టాలని వివరించారు. వికారాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారికి దగ్గరలో ఉండే విధంగా నిర్మాణం చేపడితే ప్రజల రాకకు అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయంలోని అన్ని శాఖలకు అనువుగా సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో పార్కింగ్ స్థలం ఎక్కువగా ఉండాలని , వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని తెలిపారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణీదేవి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, జిల్లా కలెక్టర్ పౌసుమిబసు, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, టీఎస్ ఈడబ్ల్యూ ఐడీసీ చైర్మన్ నాగేందర్గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళి కృష్ణగౌడ్, అదనపు కలెక్టర్లు చంద్రయ్య, మోతీలాల్, మున్సిపల్ కమిషనర్ బుచ్చయ్య, ఆర్డీవో వేణు, డీఆర్డీవో కృష్ణన్, డీపీవో రిజ్వాన, డీఎల్పీవో అనిత, ఏఎంస్సీ చైర్మన్ విజయ్కుమార్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్కుమార్, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు.