వికారాబాద్, ఏప్రిల్ 1 : అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం వికారాబాద్ మండల పరిధిలోని గోధుమగూడలో ‘మీతోనేను’ కార్యక్రమంలో భాగంగా పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని ఎత్తు భాగంలో ఉన్న నివాసాలకు మిషన్ భగీరథ నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. గ్రామంలో పలు వ్యక్తులకు సంబంధించి పట్టాపాసుపుస్తకాలు, పహానిలో వ్యత్యాసం ఉన్నదని ఎమ్మెల్యే దృష్టికి స్థానికులు తీసుకువచ్చారు. సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం చేయాలని రెవెన్యూ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. గ్రామంలో పలు ఇండ్లపై నుంచి విద్యుత్ తీగలు వేలాడుతున్నాయని, కొత్త తీగలు అమర్చి ట్రాన్స్ ఫార్మర్ను బిగించాలని ఎమ్మెల్యేను కోరారు. దీంతో ఆయన కల్పించుకుని గ్రామంలో ఎలాంటి విద్యుత్ సమస్యలైనా వెంటనే పరిశీలన చేసి పూర్తి స్తాయిలో సమస్యను పరిష్కరిస్తామన్నారు. విద్యుత్ అధికారులు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయవద్దని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రకళ, సర్పంచ్ అనిత, జడ్పీటీసీ ప్రమోదిని, పీఎసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, ఎంపీటీసీ పుష్పలత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కమాల్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు వెంకటయ్య, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, ఉపసర్పంచ్ నర్సింహులు, జనరల్ సెక్రటరి సత్యయ్యగౌడ్, ఎంపీడీవో సుభాషిణి, మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పేదలకు ప్రభుత్వం అండ
నిరుపేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు గ్రామాల ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఆయన వెంట జడ్పీటీసీ ప్రమోదిని, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, ఎంపీపీ చంద్రకళ, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు వెంకటయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కమాల్రెడ్డి పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ..
ఆ నాలుగు నగరాల్లో నైట్ కర్ఫ్యూ పొడగింపు..!
హలాలా.. జట్కానా.. రెస్టారెంట్లు ఆ బోర్డు పెట్టాల్సిందే