ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
40మందికి చెక్కుల పంపిణీ
సారంగాపూర్, ఏప్రిల్ 16: తెలంగాణలో ఆడబిడ్డల ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం కింద ఆర్థికసాయం అందజేస్తున్నదని ఎమ్మెల్యే డ్టాకర్ సంజయ్కుమార్ ఉద్ఘాటించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఆయా గ్రామాలకు చెందిన 40 మందికి మంజూరైన కల్యాణ లక్ష్మి చెక్కులను, నలుగురికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.1.56లక్షల విలువ గల చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో ప్రతి ఒక్కరికీ చీరెలను బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి పథకాలు నిరుపేద కుటుంబాలకు వరంలా మారాయన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మేడిపెల్లి మనోహర్ రెడ్డి, వైస్ఎంపీపీ సొల్లు సురేందర్, సింగిల్ విండో చైర్మన్లు ఏలేటి నర్సింహారెడ్డి, గురునాథం మల్లారెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు గుర్రాల రాజేందర్ రెడ్డి, మానాల సహస్రమాల, ఢిల్లీ రామారావు, జోగినపల్లి సుధాకర్ రావు, రమణారావు, తోడేటి శేఖర్ గౌడ్, లక్ష్మారెడ్డి, రవీందర్, విజయ్, వంశీ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సీసీ కెమెరాలు ప్రారంభం
జగిత్యాల టౌన్, ఏప్రిల్ 16: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (పురాతన)కు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ సోదరుడు, ప్రముఖ న్యాయవాది ఎం సందీప్కుమార్ రూ. 50 వేల విలువ గల 12 సీసీ కెమెరాలు, సామగ్రిని అందించారు. వాటిని శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో డీఈవో జగన్మోహన్రెడ్డి, పట్టణ సీఐ జయేశ్రెడ్డి, రోటరీ ఆపీ సభ్యులు ఎం సిరిసిల్ల శ్రీనివాస్, టీవీ సూర్యం, ముత్తు రాజు, ప్రధానోపాధ్యాయుడు రామానుజం, ఉపాధ్యాయులు ఆనందరావు, దేవయ్య, లక్ష్మణ్, రజిత, అనిత, విద్యాదేవి, పద్మ, సురేందర్, రవీందర్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ప్రభాస్ సూపర్ ఛిల్ అంటోన్న శృతిహాసన్
మారుతి కారు కొంటే షాక్.. 4 నెలల్లో 56వేలు పెంపు