తాండూరు రూరల్, ఆగస్టు :తాండూరు మండలం, చింతామణిపట్టణంలో బోనమ్మ దేవతకు గ్రామ మహిళలు బోనాల పండుగ సందర్భంగా శుక్రవారం బోనం సమర్పించారు. గ్రామ సర్పంచ్ విమలమ్మ ఆధ్వర్యంలో గ్రామంలో బోనమ్మ దేవత పండుగ సంబురాలను ఘనంగా నిర్వహించారు. డప్పువాయిద్యాలతో ఊరేగింపుగా బయలుదేరిన మహిళలు అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రభాకర్రెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.